బెంగాల్ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. రక్తంతో తడిచే బెంగాల్ వద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమయంలో, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులపై హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్.. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయన.. ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రక్తంతో తడిచే బెంగాల్ వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఈ భూమిలో హింసకు చోటు లేదన్న ఆయన.. ఇక్కడ ఎవరి మనస్సు కూడా భయం నుండి విముక్తి పొందలేదని కామెంట్ చేశారు. ప్రభుత్వ అధికారులు, సీఎంను తాను అభ్యర్థిస్తున్నానని, ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందడం మనకు చాలా అవసరమన్నారు. ప్రజల్లో భయాందోళన ఎక్కువగా ఉన్నదని, ప్రజాస్వామ్యం చివరి శ్వాసను పొందుతున్నదని గవర్నర్ విమర్శించారు.
బెంగాల్లో అవసరమైన చర్యలను సీఎం మమతా బెనర్జీ తీసుకుంటారని, ప్రభుత్వం సానుకూల విధానాన్ని అవలంభిస్తుందని తాను ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు గవర్నర్ జగదీప్ ధంఖర్.. బెంగాల్ అగ్నిగోళంగా మారడాన్ని తాను అనుమతించను అన్నారు. మరోవైపు.. ఫిరాయింపుల వ్యతిరేక చట్టం, తిల్జాల, చందన్ నగర్ సంఘటనలతో సహా నాలుగు అంశాలను తన దృష్టికి తెచ్చేందుకు సువేందు అధికారితో సహా 50 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తనకు మెమోరాండం అందజేసినట్లు తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే బెంగాల్లో కూడా ఫిరాయింపుల వ్యతిరేక చట్టం పూర్తిస్థాయిలో వర్తిస్తుందన్నారు.. కాగా, ఎన్నికల ముందు టీఎంసీని వీడి.. బీజేపీలో చేరిన కొందరు నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలు సైతం.. మళ్లీ టీఎంసీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!