Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..
- 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్..
- మరోసారి దుస్సాహసానికి దిగితే తీవ్ర పరిస్థితులు..
- పాకిస్తాన్ను హెచ్చరించిన రాజ్నాథ్ సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: ఇరాన్ యుద్ధం నీడలో ఎలాంటి ‘‘దుస్సాహసానికి’’ పాల్పడొద్దని పాకిస్తాన్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఏడాది పూర్తవుతున్న కొద్ది రోజుల ముందు ఆయన నుంచి ఈ వార్నింగ్ వచ్చింది. కేరళలో జరుగుతున్న సైనిక్ సమ్మాన్ సమ్మేళనంలో రాజ్నాథ్ మాట్లాడుతూ, మధ్యప్రాచ్యంలోని అశాంతిని అవకాశంగా తీసుకుని పాకిస్థాన్ అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తే, భారతదేశం యొక్క ప్రతిస్పందన “నిర్ణయాత్మకంగా” ఉంటుందని అన్నారు.
Read Also: Iran: ‘‘మా భారత మిత్రులు సురక్షితం, ఆందోళన అవసరం లేదు’’.. ఇరాన్ మెసేజ్..
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే, మన పొరుగుదేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడొచ్చని, అలా జరిగితే భారత్ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ఆయన చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఏప్రిల్ 22న కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 25 మంది పర్యాటకులు హత్య చేయబడిన తర్వాత, భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది.
ఉరి దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, ఇప్పుడు ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదాన్ని గట్టి దెబ్బ కొట్టామని రాజ్నాథ్ సింగ్ అననారు. ఢిల్లీలో ఇటీవల పాకిస్తానీ పౌరులు పట్టుబడిన తర్వాత, పాకిస్తాన్ మీడియా తమ దేశంపై భారత్ ఒక ఆపరేషన్కు సిద్ధమవుతుందని ఆరోపించిన తర్వాత రాజ్నాథ్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. అమెరికా ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి ఆపరేషన్ చేయడానికి భారత్ ప్లాన్ చేస్తుందని పాకిస్తానీ దినపత్రిక ది డాన్ నివేదించింది.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!