Drugs Mafia: కేరళలో రూ.1,526 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో భారీ ఎత్తున డ్రగ్స్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొచ్చిన్ కోస్ట్ గార్డ్ లక్షద్వీప్ దీవులలో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. రూ.1,526 కోట్ల విలువ చేసే 218 కేజీల హెరాయిన్ సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కేటుగాళ్లు విదేశాల నుండి సముద్ర మార్గం ద్వారా హెరాయిన్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు లక్షద్వీప్ దీవులలో అధికారుల బృందం మాటు వేసింది. 12 రోజుల నిరీక్షణ తరువాత రెండు బోట్లలో తరలిస్తున్న డ్రగ్స్ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
MLC Anantha Babu: కారులో డ్రైవర్ మృతదేహం.. తీవ్ర కలకలం!
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
హెరాయిన్ను కిలో ప్యాకెట్ల రూపంలో ప్యాకింగ్ చేసి బోటు కింది భాగంలో దాచి స్మగ్లర్లు తరలించే యత్నం చేశారని డీఆర్ఐ అధికారులు తెలిపారు. సముద్ర మార్గం ద్వారా అధికారుల కళ్లు గప్పి భారీగా డ్రగ్స్ను తరలించే యత్నం చేయగా.. ఆపరేషన్ ఖోజ్ బీన్ అనే పేరుతో అధికారుల బృందం రంగంలోకి దిగింది. ప్రిన్స్, లిటిల్ జీసెస్ అనే పేరుతో కొచ్చిన్ వైపు వెళ్తుండగా బోట్లు అనుమానాస్పదంగా నిపించడంతో అధికారుల బృందం అడ్డుకుంది. బోట్లలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని డీఆర్ఐ అధికారులు తమదైన స్టైలులో విచారణ చేపట్టారు. హెరాయిన్ను పడవ కింది భాగంలో దాచి ఇండియాకు తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరు ఇక్కడికి పంపారు? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారుల సమాచారం కోసం కూపీ లాగుతున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!