Drugs Mafia: కేరళలో రూ.1,526 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో భారీ ఎత్తున డ్రగ్స్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొచ్చిన్ కోస్ట్ గార్డ్ లక్షద్వీప్ దీవులలో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. రూ.1,526 కోట్ల విలువ చేసే 218 కేజీల హెరాయిన్ సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కేటుగాళ్లు విదేశాల నుండి సముద్ర మార్గం ద్వారా హెరాయిన్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు లక్షద్వీప్ దీవులలో అధికారుల బృందం మాటు వేసింది. 12 రోజుల నిరీక్షణ తరువాత రెండు బోట్లలో తరలిస్తున్న డ్రగ్స్ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
MLC Anantha Babu: కారులో డ్రైవర్ మృతదేహం.. తీవ్ర కలకలం!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
హెరాయిన్ను కిలో ప్యాకెట్ల రూపంలో ప్యాకింగ్ చేసి బోటు కింది భాగంలో దాచి స్మగ్లర్లు తరలించే యత్నం చేశారని డీఆర్ఐ అధికారులు తెలిపారు. సముద్ర మార్గం ద్వారా అధికారుల కళ్లు గప్పి భారీగా డ్రగ్స్ను తరలించే యత్నం చేయగా.. ఆపరేషన్ ఖోజ్ బీన్ అనే పేరుతో అధికారుల బృందం రంగంలోకి దిగింది. ప్రిన్స్, లిటిల్ జీసెస్ అనే పేరుతో కొచ్చిన్ వైపు వెళ్తుండగా బోట్లు అనుమానాస్పదంగా నిపించడంతో అధికారుల బృందం అడ్డుకుంది. బోట్లలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని డీఆర్ఐ అధికారులు తమదైన స్టైలులో విచారణ చేపట్టారు. హెరాయిన్ను పడవ కింది భాగంలో దాచి ఇండియాకు తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరు ఇక్కడికి పంపారు? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారుల సమాచారం కోసం కూపీ లాగుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?