Ram Setu: రామసేతు ఉందని చెప్పడం కష్టం, కానీ.. పార్లమెంట్లో కేంద్రమంత్రి
Difficult to say real form of Ram Setu is present, says Union Minister Jitendra Singh: చాలా ఏళ్లుగా ‘రామసేతు’పై చర్చ నడుస్తూనే ఉంది. ఆడమ్స్ బ్రిడ్జ్ గా పిలవబడే ఈ నిర్మాణమే రామాయణ కాలంలో శ్రీరాముడు లంకకు నిర్మించిన వారధి అని చాలా మంది హిందువులు భావిస్తుంటారు. తమిళనాడు రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ వరకు ఈ బ్రిడ్జ్ ఉంది. ఇది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా ఉంది. అయితే ఈ అంశం తాజాగా జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. రామసేతుపై హర్యానాకు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ కార్తికేయ శర్మ రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన కోసం ఆయన ప్రశ్నని లేవనెత్తారు.
అయితే ఎంపీ కార్తికేయ శర్మ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సమాధానం చెప్పారు. ‘‘సాధారణంగా చెప్పాలంటే రామసేతు అసలు రూపం అక్కడ ఉందని చెప్పడం కష్టం..అయితే అక్కడ ఉన్న సూచనలను బట్టి నిర్మాణం అక్కడ ఉండవచ్చు’’ అంటూ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వాలు రామసేతుపై ఎలాంటి శ్రద్ధ చూపలేదని.. భారతదేశ అద్భుతమైన చరిత్రపై ప్రభుత్వం ఏదైనా శాస్త్రీయ పరిశోధన చేస్తుందా..? అని ఎంపీ కార్తికేయశర్మ ప్రశ్నించారు.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
Read Also: USA: అమెరికా ఆశ ప్రాణాలు తీసింది.. మెక్సికో గోడపై నుంచి జారిపడ్డ కుటుంబం.. ఒకరు మృతి
రామసేతుకు సంబంధించి ఎంపీ ప్రశ్నను లేవనెత్తడం చాలా సంతోషాన్ని ఇస్తుందని.. దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయని.. ఎందుకంటే రామసేతు దాదాపుగా 18 వేల ఏళ్ల క్రితం నాటి చరిత్ర.. మనం మాట్లాడుకుంటున్న వంతెన పొడవు దాదాపుగా 56 కిలోమీటర్లని స్పేస్ టెక్నాలజీ ద్వారా సముద్రంలోని కొన్ని రాళ్లను కనుక్కున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. సింపుల్ గా చెప్పాలంటే రామసేతు అసలు రూపం అక్కడ ఉందని చెప్పడం కష్టం.. అయితే అక్కడ నిర్మాణం ఉండవచ్చని సూచించే విధంగా నిర్మాణం ఉందని అన్నారు. పురాతన ద్వారక నగరాన్ని కూడా కనుక్కునేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా బీజేపీపై విమర్శలు గుప్పించారు. భక్తులంతా చెవులు విప్పి వినండి.. కళ్లు తెరిచి చూడండి.. రామసేతు ఉందనడానికి రుజువు లేదని పార్లమెంట్ లో మోదీ ప్రభుత్వ చెబుతోందని విమర్శించారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!