Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు కీలక పదవి? పార్లమెంట్ దగ్గర కాంగ్రెస్ నేతతో ఆసక్తికర సంభాషణ
- పార్లమెంట్ దగ్గర ధర్మేంద్రకు ఘనస్వాగతం
- కాంగ్రెస్ నేతతో ఆసక్తికర సంభాషణ
- ఉల్లాసంగా కనిపించిన మాజీ కేంద్రమంత్రి
- ధర్మేంద్ర ప్రధాన్కు త్వరలో కీలక పదవి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థుల ఆందోళనతో శనివారం కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత సోమవారం పార్లమెంట్కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్కు ఎన్డీఏ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్తో ఆసక్తికర సంభాషణ జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ ‘‘ఇలా జరుగుతూ ఉంటుంది’’ అని అన్నారు. ప్రధాన్ వెంటనే బదులిస్తూ.. ‘‘ఏమీ జరగలేదు’’ అని బదులిచ్చారు. ఆ తర్వాత ప్రధాన్ ‘‘నేను వీధి యోధుడిని. ఏసీ గది కార్యకర్తను కాదు.’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో కొత్త రాజకీయ చర్చ మొదలైంది. రాజీనామా తర్వాత కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఉత్సాహంగానే ఉన్నట్లు కనిపించారు. దీంతో ఆయనకు ఏదో కొత్త పదవి అప్పగించబోతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ధర్మేంద్ర ప్రధాన్కు కీలక పదవి దక్కవచ్చని భావిస్తున్నారు.
ఇక పార్లమెంటు దగ్గర ధర్మేంద్రకు ఎన్డీఏ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. కొందరు ఆయనకు తలపాగా కప్పగా.. మరికొందరు శాలువా కప్పారు. ప్రధాన్ ముఖంలో చిరునవ్వులు వెల్లివిరిశాయి. ఎలాంటి అభియోగాలు లేకుండా ఒక మంత్రి రాజీనామా చేయడం ఇదే మొదటిసారి అని ఒక ఎంపీ అన్నారు.
Also Read
- CJP: కాక్రోచ్ల సంబరాలకు డబ్బు ఎక్కడిది.? మహేష్ జెఠ్మలానీ అనుమానాలు..
- Dharmendra Pradhan: మంత్రి పదవి వీడినా ధైర్యం వీడలేదు.. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు వైరల్
- 2020 Delhi Riots Case: తాహిర్ హుస్సేన్కు ఉరిశిక్ష విధించాలి.. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు..
- Dharmendra Pradhan: రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్కు ధర్మేంద్ర ప్రధాన్.. ఘన స్వాగతం పలికిన ఎన్డీఏ ఎంపీలు
అయితే ఇప్పుడు ప్రధాన్ ఏ పాత్ర పోషిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఒడిశా బీజేపీలో శక్తివంతమైన నాయకుడిగా ఉండటంతో పాటు ఆయన కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించారు. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇన్చార్జ్గా పనిచేశారు. తదనంతరం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీకి చెందిన భవానీపూర్ స్థానంలో సువేందు అధికారి విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2024 లోక్సభ ఎన్నికలలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత.. ఆ తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఇన్చార్జ్గా హ్యాట్రిక్ సాధించడంలో ప్రధాన్ ముఖ్యమైన పాత్ర పోషించారు. అంతకుముందు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాలలో ఇన్చార్జ్గా పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
ఇదిలా ఉంటే ధర్మేంద్ర రాజీనామా తర్వాత పార్టీ ఆయనను ఒంటరిగా వదిలిపెట్టలేదు. హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి కలిశారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా బీజేపీ అగ్ర నాయకులు, విద్యా రంగంలో ధర్మేంద్ర ప్రధాన్ చేపట్టిన సంస్కరణలకు మద్దతు తెలిపారు. రాజీనామా ఆయన విశ్వసనీయత క్షీణించడానికి సంకేతం కాదని.. అది ‘‘రాజకీయ జవాబుదారీతనం, త్యాగం, జాతీయ ప్రయోజనాలకు’’ ఒక ప్రధాన ఉదాహరణ అని బీజేపీ నాయకులు కీర్తించారు.
ధర్మేంద్ర రాజీనామా ఒడిశా బీజేపీ అంతర్గత సమీకరణాలపై కూడా ప్రభావం చూపవచ్చు. జువల్ ఓరం తర్వాత రాష్ట్రం నుంచి కేబినెట్ మంత్రి అయిన రెండవ వ్యక్తి ఆయనే. ఒడిశా బీజేపీపై ప్రధాన్కు బలమైన పట్టు ఉంది. రాజీనామా వల్ల ఒడిశాలో ధర్మేంద్ర ప్రధాన్ ప్రభావం ఏమాత్రం తగ్గదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014 నుంచి ఒడిశాలో పార్టీ విస్తరణలోనూ, 2024 అసెంబ్లీ ఎన్నికలలో దాని విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలోని 78 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో చాలా మంది, ఒడిశా కేబినెట్లోని మంత్రులలో సుమారు 40 శాతం మంది ఆయనకు సన్నిహితులుగా ఉన్నారు. వాస్తవానికి ఒడిశా ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీదారుగా ఉన్నారు. కానీ ఆ పదవి అనూహ్యంగా మోహన్ మాఝీకి దక్కింది. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి కూడా పోటీదారుగా నిలువగా.. కానీ ఆ పదవి నితిన్ నవీన్కు దక్కింది. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి కూడా పోయింది.
అయితే పార్టీ సంస్థలో ఆయనకు ఏదైనా బాధ్యత అప్పగించవచ్చని భావిస్తున్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం వహించవచ్చని సమాచారం. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆయన తన పదవికి రాజీనామా చేశారని మద్దతుదారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Pakistan: అసిమ్ మునీర్ చేతుల్లోకి పాకిస్తాన్.. సైన్యం వద్ద ‘‘న్యూక్లియర్ బటన్’’..
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు కీలక పదవి? పార్లమెంట్ దగ్గర కాంగ్రెస్ నేతతో ఆసక్తికర సంభాషణ
-
Ranbir Kapoor: నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కింగ్ రణబీర్ కపూర్ అవుతాడా?
-
CJP: కాక్రోచ్ల సంబరాలకు డబ్బు ఎక్కడిది.? మహేష్ జెఠ్మలానీ అనుమానాలు..
-
Bank of Baroda Data Leak: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ డేటా లీక్? ప్రమాదంలో కోట్లాది కస్టమర్ల సమాచారం!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!