Dharmasthala: ధర్మస్థలపై తప్పుడు ప్రచారం, డబ్బులు తీసుకుని యూట్యూబర్ల కథనాలు
- దేశవ్యాప్తంగా సంచలనంగా ‘‘ధర్మస్థల’’కేసు..
- ధర్మస్థల పవిత్రతను దెబ్బతీయడానికి కుట్ర..
- పలువురు యూట్యూబర్లకు వ్యతిరేక కథనాల కోసం నిధులు..
- కన్నడ యూట్యూబర్ సంచలన వాదన..
Dharmasthala: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల వార్తల్లో ప్రధానాంశంగా మారింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే హోరు. హిందువులకు ఎంతో పవిత్రమైన స్థలంలో వందలాది మృతదేహాలను బలవంతంగా ఖననం చేశానని అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలా మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ‘‘ధర్మస్థలం’’పై అనేక వీడియోలు చేశారు. వందలాది శవాలు దొరుకుతున్నాయని హోరెత్తించారు. చివరకు ఎవరైతే ఈ ఆరోపణలు చేశాడో, అవన్ని తప్పుడు ఆరోపణలే అని తేలింది.
అయితే, ఇప్పుడు ఓ యూట్యూబర్ చేసిన వాదన సంచలనంగా మారింది. ధర్మస్థలను అవమానపరిచేలా, ధర్మస్థలకు వ్యతిరేకంగా కంటెంట్ చేయడానికి అనేక మంది ఇన్ఫ్లూయెన్సర్లకు డబ్బు చెల్లించారని ఆ యూట్యూబర్ పేర్కొన్నారు. య్యూట్యూబ్లో ‘‘గోల్డెన్ కన్నడిగ’’ వ్లాగ్ ఛానెల్ నిర్వహిస్తున్న సుమంత్ గౌడ ఈ సంచలన ఆరోపణలు చేశారు. హిందువులకు ఎంతో పవిత్రమైన పట్టణమైన ‘‘ధర్మస్థల’’కు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించాలని తనకు కూడా డబ్బులు ఆఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
Read Also: SIR: దేశ వ్యాప్తంగా ‘‘SIR’’ అమలుకు ఎన్నికల సంఘం సిద్ధం..!
ధర్మస్థలపై కంటెంట్ చేయడానికి డబ్బు తీసుకున్న అనేక మంది యూట్యూబర్లతో తాను మాట్లాడానని సుమంత్ వెల్లడించారు. దీని వెనక ఎవరున్నారు.. ఎవరు నిధులు ఇచ్చారు అనే విషయాలను మనం కనుక్కోవాలి. వారు నాకు డబ్బులు ఆఫర్ చేశారు.’’ అని అన్నారు. తన తోటి యూట్యూబర్ కూడా అలాంటి కంటెంట్ చేసినందుకు డబ్బులు వస్తున్నాయిని చెప్పాడని, డజన్ల కొద్దీ కంటెంట్ క్రియేటర్లుఈ విషయాన్ని వైరల్ చేశారని అన్నారు.
ఈ కేసులో, గతంతో ధర్మస్థల పర్యటనకు వచ్చి తన కూతురు తప్పిపోయిందని చెప్పిన ఒక మహిళ, తనను ఓ యూట్యూబర్ తప్పుడు ఆరోపణలు చేయాల్సిందిగా బలవంతపెట్టాడని ఆరోపించింది. లైంగిక వేధింపులకు గురైన అనేక మంది యువతుల మృతదేహాలతో సహా అనేక మంది మృతదేహాలను ఖననం చేసినట్లు చెప్పిన సీఎన్ చిన్నయ్య కూడా అబద్ధాలు చెప్పినట్లు సిట్ కనుగొంది. అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు కర్ణాటకలో రాజకీయంగా ఉద్రిక్తతలకు కారణమైంది. బీజేపీ దీనిని ‘‘హిందుత్వ వ్యతిరేక కుట్ర’’గా అభివర్ణించింది.
తాజావార్తలు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
-
Ishan Kishan: కెప్టెన్గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
-
Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్డేట్ అదిరిపోయింది..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!