RJD: బీహార్ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన ఆర్జేడీ.. అయినా ఎందుకు ఘోర పరాజయం.?
- బీహార్ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన ఆర్జేడీ..
- అయినా కూడా ఘోర పరాజయం..
- కూటమి కారణంగా విఫలమైన తేజస్వీ యాదవ్..
- కూటమిగా ఎన్డీయేకు తిరుగులేని ఓట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RJD: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ-జేడీయూ-ఎల్జేపీల కూటమి 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీ నేతృత్వంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టుల కూటమి ‘‘మహా ఘట్బంధన్’’ కేవలం 35 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇందులో ఆర్జేడీ 25 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 6 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆర్జేడీ తన చరిత్రలో రెండో చెత్త ప్రదర్శన చేసింది. అంతకుముందు, 2010లో కేవలం 22 సీట్లు వచ్చాయి.
అయితే, ఓ విషయంలో మాత్రం ఆర్జేడీ ఇతర పార్టీలకు అందకుండా నిలిచింది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం, బీహార్ ఎన్నికల్లో 143 సీట్లలో పోటీ చేసి 25 స్థానాలు గెలుచుకున్న ఆర్జేడీ పార్టీ 23 శాతం ఓట్లను సంపాదించింది. 2020 ఎన్నికలతో పోలిస్తే 23.11 ఓట్ల శాతం నుంచి స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూల కన్నా అత్యధిక ఓట్లను సంపాదించింది.
Also Read
- Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
- Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
- El Nino Effect On Stock Market: ఎల్నినో ప్రభావం స్టాక్ మార్కెట్పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
- పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 1.15 కోట్ల (1,15,46,055) మంది ప్రజలు ఆర్జేడీకి ఓటేశారు. 89 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి 20.08% ఓట్లను సాధించింది, ఇది 2020లో 19.46% కన్నా ఎక్కువ. 1,00,81,143 మంది కమలానికి ఓటేశారు. నితీష్ కుమార్ జేడీయూ 101 సీట్లలో పోలీ చేసి 85 సీట్లను గెలుచుకుంది. 2020లో సంపాదించిన 15.39 % నుండి ఈసారి 19.25%కి పెంచుకుంది. 19.25% ఓట్ల శాతం అంటే, 96,67,118 ఓట్లను సంపాదించింది.
ఓటమి కారణం ఇదే:
అయితే, ఆర్జేడీ ఒంటరిగా ఎక్కువ ఓట్లను సంపాదించినప్పటికీ కూటమిగా దారుణంగా విఫలమైంది. ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ‘‘మహా ఘట్బంధన్’’ కూటమికి 35.89% ఓట్లు వచ్చాయి. ఇక ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చాలు కలిసి 46-47 శాతం ఓట్లను సాధించాయి. దీంతో, ఎన్డీయే కూటమి విజయం సాధించింది.
సరళంగా చెప్పాలంటే, ఓట్ల శాతం అంటే ఆ పార్టీకి ఎంత మంది ఓటేశారో చెప్పే ఒక లెక్క. ఆర్జేడీ గెలుచుకున్న స్థానాల్లో ఎక్కువ ఓట్లు పొంది ఉండొచ్చు. కొన్ని చోట్ల రెండో పార్టీగా ఉండొచ్చు. గట్టి పోటీ ఇవ్వవచ్చు, కానీ గెలవలేకపోయి ఉండొచ్చు. దీంతో ఆర్జేడీకి ఎక్కువ మంది ఓట్లు వేసినప్పటికీ అది సీట్లుగా మారలేదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rishab Pant: అనుకున్నదే జరిగింది.. LSG కెప్టెన్సీ నుంచి రిషభ్ పంత్ ఔట్..
-
Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
-
Vaibhav Suryavanshi: వైభవ్కు మా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ దొరికితే ఖతమే.. బుడ్డోడి ఆటకు పాక్ ఫిదా..
-
Vivo T5: వివో T5 మిడ్-రేంజ్ ఫోన్ విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 6s Gen 2 చిప్
-
CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!