RJD: బీహార్ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన ఆర్జేడీ.. అయినా ఎందుకు ఘోర పరాజయం.?
- బీహార్ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన ఆర్జేడీ..
- అయినా కూడా ఘోర పరాజయం..
- కూటమి కారణంగా విఫలమైన తేజస్వీ యాదవ్..
- కూటమిగా ఎన్డీయేకు తిరుగులేని ఓట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RJD: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ-జేడీయూ-ఎల్జేపీల కూటమి 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీ నేతృత్వంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టుల కూటమి ‘‘మహా ఘట్బంధన్’’ కేవలం 35 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇందులో ఆర్జేడీ 25 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 6 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆర్జేడీ తన చరిత్రలో రెండో చెత్త ప్రదర్శన చేసింది. అంతకుముందు, 2010లో కేవలం 22 సీట్లు వచ్చాయి.
అయితే, ఓ విషయంలో మాత్రం ఆర్జేడీ ఇతర పార్టీలకు అందకుండా నిలిచింది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం, బీహార్ ఎన్నికల్లో 143 సీట్లలో పోటీ చేసి 25 స్థానాలు గెలుచుకున్న ఆర్జేడీ పార్టీ 23 శాతం ఓట్లను సంపాదించింది. 2020 ఎన్నికలతో పోలిస్తే 23.11 ఓట్ల శాతం నుంచి స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూల కన్నా అత్యధిక ఓట్లను సంపాదించింది.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 1.15 కోట్ల (1,15,46,055) మంది ప్రజలు ఆర్జేడీకి ఓటేశారు. 89 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి 20.08% ఓట్లను సాధించింది, ఇది 2020లో 19.46% కన్నా ఎక్కువ. 1,00,81,143 మంది కమలానికి ఓటేశారు. నితీష్ కుమార్ జేడీయూ 101 సీట్లలో పోలీ చేసి 85 సీట్లను గెలుచుకుంది. 2020లో సంపాదించిన 15.39 % నుండి ఈసారి 19.25%కి పెంచుకుంది. 19.25% ఓట్ల శాతం అంటే, 96,67,118 ఓట్లను సంపాదించింది.
ఓటమి కారణం ఇదే:
అయితే, ఆర్జేడీ ఒంటరిగా ఎక్కువ ఓట్లను సంపాదించినప్పటికీ కూటమిగా దారుణంగా విఫలమైంది. ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ‘‘మహా ఘట్బంధన్’’ కూటమికి 35.89% ఓట్లు వచ్చాయి. ఇక ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చాలు కలిసి 46-47 శాతం ఓట్లను సాధించాయి. దీంతో, ఎన్డీయే కూటమి విజయం సాధించింది.
సరళంగా చెప్పాలంటే, ఓట్ల శాతం అంటే ఆ పార్టీకి ఎంత మంది ఓటేశారో చెప్పే ఒక లెక్క. ఆర్జేడీ గెలుచుకున్న స్థానాల్లో ఎక్కువ ఓట్లు పొంది ఉండొచ్చు. కొన్ని చోట్ల రెండో పార్టీగా ఉండొచ్చు. గట్టి పోటీ ఇవ్వవచ్చు, కానీ గెలవలేకపోయి ఉండొచ్చు. దీంతో ఆర్జేడీకి ఎక్కువ మంది ఓట్లు వేసినప్పటికీ అది సీట్లుగా మారలేదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!