Joshimath Sinking: జోషిమఠ్లో కూల్చివేతలు ప్రారంభించిన ప్రభుత్వం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joshimath Sinking: ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణం కుంగిపోతోంది. ఇప్పటికే 600కు పైగా ఇళ్లకు బీటలు వారాయి. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే జోషిమఠ్ పట్టణం కుంగిపోవడంపై కేంద్ర ప్రభుత్వం కూడా సమావేశం అయింది. ప్రధాని నరేంద్రమోదీ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రమాదం అంచున ఉన్న ఇళ్లను కూల్చివేస్తోంది ప్రభుత్వం. మంగళవారం నుంచి కూల్చివేతను ప్రారంభించింది. జోషిమఠ్ పట్టణాన్ని మూడు భాగాలుగా విభజించింది. డేంజర్, బఫర్, పూర్తిగా సురక్షితమైన ప్రాంతాలుగా విభజించి కూల్చివేతలు ప్రారంభించింది.
Read Also: Thalapathy Vijay: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న దళపతి విజయ్ కుమారుడు
Also Read
- NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
- Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
- Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
- Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
600పైగా ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కువగా దెబ్బతిన్న వాటిని కూల్చేస్తున్నారు. జోషిమఠ్ సమీప ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలను ప్రభుత్వం నిషేధించింది. సుమారు 4000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. జోషిమఠ్ లో పరిస్థితిని అంచనా వేసిన నిపుణుల బృందం ప్రమాదకరంగా మారిన ఇళ్లను కూల్చివేయాలని సిఫారసు చేసింది. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CBRI) బృందం పర్యవేక్షణలో కూల్చివేతలు జరుగనున్నాయి.. వీరికి సహాయం చేయడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF)ని పిలిపించారు.
జోషిమఠ్ ప్రజలు అక్కడ నిర్మితం అవుతున్న ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పట్టణం కుంగుబాటుకు ఇది కారణం కాదని.. అనేక దశాబ్ధాల క్రితం విరిగిపడిన కొండచరియలపై నిర్మాణాలు కొనసాగడం, అక్కడ ఏటవాటుగా భూమి ఉండటం వల్ల ఈ జోషిమఠ్ కుంగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. బద్రీనాథ్ కు గేట్ వేగా భావించే జోషిమఠ్ పట్టణంలో ఇటీవల కాలంలో భవననిర్మాణాలు, రోడ్ల విస్తరణ పెరిగింది. దీంతో నేల వదులుగా ఉండటంతో నిర్మాణాలు దెబ్బతింటున్నాయి.
Uttarakhand | Demolition of Hotel Malari Inn in Joshimath to begin shortly. SDRF deployed at the spot & announcements being made through loudspeakers for people to go to safer places.
Experts decided to demolish Hotel Malari Inn & Hotel Mount View after they were declared unsafe pic.twitter.com/ofPnc8h4cT
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2023
తాజావార్తలు
-
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
-
Chairman’s Desk : కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా గేమ్ ఛేంజరా?
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
-
Thaman: ఇదే నా లాస్ట్ సినిమా: తమన్
-
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!