Corona Virus: ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. స్కూళ్లు బంద్
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో మరోసారి కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కొత్తగా 461 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 26 శాతానికి పెరిగింది. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని… ఈ నేపథ్యంలో స్కూళ్లను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. అటు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను పెంచి వైరస్ సోకిన వారిని ముందస్తుగా గుర్తించి వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఈ నెల 20న సమావేశం కానుంది. కరోనా పరిస్థితిపై సమీక్షించి నియంత్రణకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయనుంది.
Also Read
COVID 4th Wave: కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే.. భారత్లో ఫోర్త్ వేవ్ స్టార్ట్ అయ్యిందా..?!
తాజావార్తలు
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!