Delhi riots case: ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ బెయిల్పై జనవరి 5న సుప్రీంకోర్టు తీర్పు..
- షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్..
- జనవరి 5న సుప్రీంకోర్టు తీర్పు..
- ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారులగా ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi riots case: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం (UAPA) చట్టం కింద అరెస్టయిన ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్, ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లపై భారత సుప్రీంకోర్టు జనవరి 5న తన తీర్పును ప్రకటించనుంది. వీరిద్దరితో పాటు గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు అరవింద్ కుమార్, ఎన్ వి అంజరియాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో ‘‘పెద్ద కుట్ర’’దాగి ఉందని ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 2న ఇచ్చిన ఉత్వరుల్ని నిందితులు అత్యున్నత కోర్టులో దాఖలు చేశారు.
ఈ కేసుపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం డిసెంబర్ 10న తన తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ పోలీసుల తరుపున రపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వి రాజు హాజరుకాగా, నిందితుల తరుపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూత్రాలు వాదించారు. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ ఈ కేసులో కీలక నిందితులుగా, అల్లర్లకు ముఖ్య సూత్రధారులుగా ఉన్నారు. వీరిపై యూఏపీఏ కేసు నమోదైంది.
Also Read
- Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
- DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
- Accidnet: ఆఫ్ఘనిస్తాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
- Abhishek Banerjee: మమతా బెనర్జీ అల్లుడిని నడిరోడ్డు మీద ఉతికేసిండ్రు.. బట్టలు చింపి, రాళ్లు, గుడ్లతో కొట్టి రచ్చ రచ్చ!
Read Also: Jana Nayakudu Trailer: ‘ముట్టుకోకు ముక్కలు చేస్తాడు’.. ‘జన నాయకుడు’ ట్రైలర్ వచ్చేసింది!
పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు ప్రతిపాదిత జాతీయ పౌర పౌరసత్వ రిజిస్టర్ (NRC)కి వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ‘‘పాలనను మార్చే కుట్ర’’దాగి ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. భారత్ను అస్థిర పరచడానికి, ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాన్ని దించే ఆపరేషన్లో భాగంగా ఆరోపించారు. మత ప్రాతిపదికన నిందితులు రూపొందించిన భారీ కుట్రగా అభివర్ణించారు.
అల్లర్ల కోసం ‘‘చక్కా జామ్’’ ఆలోచనకు ఉమర్ ఖలీద్ కీలకమని, ఢిల్లీ ప్రొటెస్ట్ సపోర్ట్ గ్రూపు పేరుతో హింసను ప్లాన్ చేయడంలో కీలక పాత్ర పోషించాడని ప్రధాన ఆరోపణ. అల్లర్ల సమయంలో ఉపయోగించడానికి స్థానిక మహిళలను కత్తులు, రాళ్లు, యాసిడ్ సీసాలు, ఇతర వస్తువులను నిల్వ చేయమని ఇతరులకు ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షర్జీల్ ఇమామ్ ఉమర్ ఖలీద్, ఇతర కుట్రదారుల మార్గదర్శకత్వంలో పనిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతను జామియా మిలియా ఇస్లామియా, అసన్సోల్లో ప్రసంగాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టి, జాతీయ రాజధానిని స్తంభింపజేయడానికి విధ్వంసకరమైన “చక్కా జామ్”కు పిలుపునిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
-
DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..