Regime-change operation: మోడీని దించేయాలనే కుట్ర.? 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో సంచలనం..
- 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు అఫిడవిట్..
- పాలన మార్చేందుకు ప్లాన్ ప్రకారం అల్లర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Regime-change operation: 2020 ఢిల్లీ మత అల్లర్ల కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు సంచలనాలకు దారి తీసింది. ఈ అల్లర్ల కుట్ర కేసులో నిందితులైన ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, మీరాన్ హైదర్, గుల్ఫిషా ఫాతిమా, ఇతరుల బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ సిద్ధం చేశారు. ఈ హింసాకాండ ప్రణాళికాబద్ధంగా జరిగిందని, పాలనను మార్చేందుకు ‘‘రెజిమ్ ఛేంజ్ ఆపరేషన్’’లో భాగమని పోలీసులు పేర్కొన్నారు.
Read Also: CP Sajjanar: వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ ప్రచారం.. సీపీ సజ్జనార్ సీరియస్..
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
పోలీసుల ప్రకారం, అల్లర్లు ఆకస్మికంగా జరగలేదని, దేశంలో శాంతికి భంగం కలిగించడానికి, ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం చేసిన ప్రయత్నమని పోలీసులు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2020 హింసకు సంబంధించి, యూఏపీఏ కేసులో ఖలీద్, ఇతరులకు ఢిల్లీ హైకోర్ట్ బెయిల్ నిరాకరించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. పౌరసత్వం (సవరణ) చట్టం (CAA)కు వ్యతిరేకంగా ఉన్న అసమ్మతిని ఆయుధంగా చేసుకుని “భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతను దెబ్బతీసేందుకు” ఈ అల్లర్లు రూపొందించబడ్డాయని పోలీసులు గట్టిగా వాదిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ మొదటి పదవీ కాలంలో భారతదేశాన్ని సందర్శించేందుకు వచ్చిన సమయంలోనే, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు, దేశాన్ని నెగిటివ్గా చిత్రీకరించేందుకు హింసాకాండ జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితులు పనికి రాని దరఖాస్తులు పెట్టి విచారణ ప్రక్రియను క్రమబద్ధంగా ఆలస్యం చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!