Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- ఢిల్లీలో పోలీసులపై దాడి
- కళ్లలో కారం పొడి, కర్రలు, ఇటుకలతో కొట్టారు
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Police Attack Video: దేశ రాజధాని ఢిల్లీలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఓ గుంపు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. భల్సా డైరీ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై కొందరు వ్యక్తులు కారం పొడి విసిరి, కర్రలు, ఇటుకలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి రావడంతో ఈ దాడి తీవ్ర చర్చకు దారితీసింది.
అసలు ఏం జరిగింది?
ఢిల్లీ పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో పోలీసు బృందం భల్సా డైరీ ప్రాంతంలో సాధారణ గస్తీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తనిఖీల్లో భాగంగా ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే వాహన యజమానితో పాటు మరికొందరు వ్యక్తులు పోలీసులను అడ్డుకుని వారిపై దాడికి దిగినట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
కారం పొడి చల్లి.. కర్రలు, ఇటుకలతో దాడి
పోలీసులపై దాడి చేసిన గుంపు ముందుగా వారి కళ్లలో కారం పొడి చల్లినట్లు సమాచారం. అనంతరం కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. దాడి కారణంగా ముగ్గురు పోలీసు సిబ్బంది గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో సునీల్ అలియాస్ పంకజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. పోలీసుల ప్రకారం, పంకజ్పై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయి. అతనికి తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులతో కలిపి మొత్తం ఐదు కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మైనర్ నిందితుడు అరెస్ట్
ఘటన జరిగిన వెంటనే పోలీసులు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలోనే ఓ మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక దాడిలో పాల్గొన్న మిగిలిన వ్యక్తుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి, దాడిలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
దర్యాప్తు కొనసాగుతోంది
పోలీసులపై దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాడికి అసలు కారణం ఏమిటి? వాహనాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది? దాడిలో ఇంకా ఎంతమంది పాల్గొన్నారు? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.
दिल्ली पुलिस पर भलस्वा डेयरी इलाके में हमला। आंखों में मिर्ची पाउडर डालकर लाठी–डंडों से बर्बरता से पीटा गया। दरअसल, पुलिस ने एक बाइक सीज कर दी थी। स्थानीय लोग इस कार्रवाई का विरोध कर रहे थे। मुख्य आरोपी सुनील उर्फ पंकज बताया जा रहा है। pic.twitter.com/Fq6LIYs49q
— Sachin Gupta (@Sachingupta) August 23, 2026
తాజావార్తలు
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!