Delhi: మరో లివ్ ఇన్ రిలేషన్ కేసు..శ్రద్ధా తరహాలో మహిళ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Man Kills Live-In Partner, Tries To Chop Up Body: శ్రద్ధా వాకర్ హత్య కేసు యావత్ దేశాన్ని షాకుకు గురిచేసింది. అత్యంత పాశవికంగా ఆమెను లవర్ అఫ్తాబ్ చంపేశాడు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధ గొంతు కోసేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా చేశాడు. భాగాలను ఢిల్లీ శివార్లలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. చివరకు శ్రద్ధా తండ్రి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న అఫ్తాబ్ పోలీసు విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. శ్రద్ధాను హత్య చేయడమే కాకుండా పశ్చాతాప పడటం లేదని పోలీసులు వెల్లడించారు.
Read Also: Pakistan Cricket Board: ఆసియా కప్ వేదిక మారిస్తే.. టోర్నీని బహిష్కరిస్తాం
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
ఇదిలా ఉంటే శ్రద్ధా తరహాలోనే ఢిల్లీలో ఓ వ్యక్తి సహజీవనంలో ఉన్న మహిళను చంపేశాడు. పశ్చిమ ఢిల్లీ తిలక్ నగర్ కు చెందిన 35 ఏళ్ల మహిళను చంపినందుకు ఓ వ్యక్తిని పంజాబ్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ హత్య వ్యవహారంలో శ్రద్ధా వాకర్ హత్యను ప్రేరణగా చేసి చంపినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. రేఖా రాణి అనే మహిళ మన్ ప్రీత్ తో సహజీవనం చేస్తోంది. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న మన్ ప్రీత్, రేఖ వాణితో 2015 నుంచి సంబంధం నెరుపుతున్నాడు. అయితే ఆమెతో సంబంధాన్ని తెంచుకోవాలనుకున్న మన్ ప్రీత్ ఆమెను చంపాలని అనుకున్నాడు.
తిలక్ నగర్ లో రేఖ తన 16 ఏళ్ల కూతురుతో నివాసం ఉంటోది. డిసెంబర్ 1న రాత్రి రేఖ కుమార్తెకు నిద్రమాత్రలు వేసి, ఆమె నిద్ర పోయిన తర్వాత రేఖను కత్తితో నరికి చంపాడు. అయితే రేఖ శరీరాన్ని కత్తితో భాగాలు చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ.. కుమార్తె గుర్తిస్తుందని భయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మన్ ప్రీత్ కిడ్నాపులు, హత్య కేసుల్లో వాంటెడ్ గా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రేఖ వాణి కుమార్తె ఫిర్యాదు మేరకు ఐసీసీ 302 హత్యనేరం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!