Delhi: రూ.500 నోటు హత్యకు కారణం అయింది.. వ్యక్తిని చంపిన నలుగురు మైనర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Four minors killed the shop owner over Rs.500 issue: వయలెన్స్ ఫ్యాషన్ గా మారింది కొందరికి. నేర ప్రపంచంలో పెద్ద పేరు సంపాదించాలని చూసిన నలుగురు మైనర్ యువకులు కటకటాల పాలయ్యారు. ఏకంగా ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. కేవలం మురికిగా ఉన్న రూ. 500 నోటు ఇవ్వడంతో షాప్ యజమానికి, నలుగురు మైనర్లకు అయిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీ భజన్ పురాలో చోటు చేసుకుంది.
గతంలో ఆ ప్రాంతంలోని ఓ దుకాణం నుంచి సరుకులు కొనుగోలు చేయడానికి రూ.500 నోటు ఇవ్వగా.. అది పాతగా, మురికిగా ఉండటంతో షాప్ యజమానికి, మైనర్ యువకులకు వాగ్వాదం జరిగింది. దీన్ని మనసులో ఉంచుకుని ఎలాగైనా బుద్ధి చెప్పాలని గురువారం షాప్ యజమానిని నలుగురు మైనర్ యువకులు పొడిచి చంపారు.
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Read Also: Kerala Savari: కేరళ ప్రభుత్వ వినూత్న నిర్ణయం.. సొంతగా క్యాబ్ సర్వీస్ ప్రారంభం
గురువారం రాత్రి భజన్ పురాలోని సుభాష్ మొహల్లాలో దుకాణం యజమాని షానవాజ్ ను కత్తితో పొడిచి హత్య చేశారు నలుగురు మైనర్లు. పోలీసులు వెళ్లే సరికే బాధితుడు షానవాజ్ అపస్మారస్థితిలో పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించే సమయానికే ఆయన మరణించారు. అయితే హత్య చేసిన ప్రాంతం నుంచి స్కూటీపై నలుగురు యువకులు పారిపోతుండటాన్ని పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. వీరిని వెంబడించిన పోలీసులు నలుగురు మైనర్లను యూపీలోని భోపురా బోర్డర్ లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కత్తిని, స్కూటీని రికవరీ చేసుకున్నట్లు డీసీపీ సంజయ్ కమార్ సైన్ తెలిపారు.
నేర ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించేందుకు ఈ నలుగురు మైనర్లు ఇలా చేశారని పోలీస్ విచారణలో తేలింది. హత్యకు ఒక రోజు ముందు బుధవారం భజన్ పురాలోని షానీ బజార్ రోడ్డులో తుపాకీని చూపించి స్కూటీని దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు 20 రోజుల ముందు షాప్ యజమాని షానవాజ్ తో ఈ నలుగురు మైనర్లకు రూ. 500 నోటు విషయంలో గొడవ జరిగింది.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!