Delhi: రూ.500 నోటు హత్యకు కారణం అయింది.. వ్యక్తిని చంపిన నలుగురు మైనర్లు
Four minors killed the shop owner over Rs.500 issue: వయలెన్స్ ఫ్యాషన్ గా మారింది కొందరికి. నేర ప్రపంచంలో పెద్ద పేరు సంపాదించాలని చూసిన నలుగురు మైనర్ యువకులు కటకటాల పాలయ్యారు. ఏకంగా ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. కేవలం మురికిగా ఉన్న రూ. 500 నోటు ఇవ్వడంతో షాప్ యజమానికి, నలుగురు మైనర్లకు అయిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీ భజన్ పురాలో చోటు చేసుకుంది.
గతంలో ఆ ప్రాంతంలోని ఓ దుకాణం నుంచి సరుకులు కొనుగోలు చేయడానికి రూ.500 నోటు ఇవ్వగా.. అది పాతగా, మురికిగా ఉండటంతో షాప్ యజమానికి, మైనర్ యువకులకు వాగ్వాదం జరిగింది. దీన్ని మనసులో ఉంచుకుని ఎలాగైనా బుద్ధి చెప్పాలని గురువారం షాప్ యజమానిని నలుగురు మైనర్ యువకులు పొడిచి చంపారు.
Also Read
Read Also: Kerala Savari: కేరళ ప్రభుత్వ వినూత్న నిర్ణయం.. సొంతగా క్యాబ్ సర్వీస్ ప్రారంభం
గురువారం రాత్రి భజన్ పురాలోని సుభాష్ మొహల్లాలో దుకాణం యజమాని షానవాజ్ ను కత్తితో పొడిచి హత్య చేశారు నలుగురు మైనర్లు. పోలీసులు వెళ్లే సరికే బాధితుడు షానవాజ్ అపస్మారస్థితిలో పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించే సమయానికే ఆయన మరణించారు. అయితే హత్య చేసిన ప్రాంతం నుంచి స్కూటీపై నలుగురు యువకులు పారిపోతుండటాన్ని పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. వీరిని వెంబడించిన పోలీసులు నలుగురు మైనర్లను యూపీలోని భోపురా బోర్డర్ లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కత్తిని, స్కూటీని రికవరీ చేసుకున్నట్లు డీసీపీ సంజయ్ కమార్ సైన్ తెలిపారు.
నేర ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించేందుకు ఈ నలుగురు మైనర్లు ఇలా చేశారని పోలీస్ విచారణలో తేలింది. హత్యకు ఒక రోజు ముందు బుధవారం భజన్ పురాలోని షానీ బజార్ రోడ్డులో తుపాకీని చూపించి స్కూటీని దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు 20 రోజుల ముందు షాప్ యజమాని షానవాజ్ తో ఈ నలుగురు మైనర్లకు రూ. 500 నోటు విషయంలో గొడవ జరిగింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో