Delhi: రూ.500 నోటు హత్యకు కారణం అయింది.. వ్యక్తిని చంపిన నలుగురు మైనర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Four minors killed the shop owner over Rs.500 issue: వయలెన్స్ ఫ్యాషన్ గా మారింది కొందరికి. నేర ప్రపంచంలో పెద్ద పేరు సంపాదించాలని చూసిన నలుగురు మైనర్ యువకులు కటకటాల పాలయ్యారు. ఏకంగా ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. కేవలం మురికిగా ఉన్న రూ. 500 నోటు ఇవ్వడంతో షాప్ యజమానికి, నలుగురు మైనర్లకు అయిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీ భజన్ పురాలో చోటు చేసుకుంది.
గతంలో ఆ ప్రాంతంలోని ఓ దుకాణం నుంచి సరుకులు కొనుగోలు చేయడానికి రూ.500 నోటు ఇవ్వగా.. అది పాతగా, మురికిగా ఉండటంతో షాప్ యజమానికి, మైనర్ యువకులకు వాగ్వాదం జరిగింది. దీన్ని మనసులో ఉంచుకుని ఎలాగైనా బుద్ధి చెప్పాలని గురువారం షాప్ యజమానిని నలుగురు మైనర్ యువకులు పొడిచి చంపారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Kerala Savari: కేరళ ప్రభుత్వ వినూత్న నిర్ణయం.. సొంతగా క్యాబ్ సర్వీస్ ప్రారంభం
గురువారం రాత్రి భజన్ పురాలోని సుభాష్ మొహల్లాలో దుకాణం యజమాని షానవాజ్ ను కత్తితో పొడిచి హత్య చేశారు నలుగురు మైనర్లు. పోలీసులు వెళ్లే సరికే బాధితుడు షానవాజ్ అపస్మారస్థితిలో పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించే సమయానికే ఆయన మరణించారు. అయితే హత్య చేసిన ప్రాంతం నుంచి స్కూటీపై నలుగురు యువకులు పారిపోతుండటాన్ని పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. వీరిని వెంబడించిన పోలీసులు నలుగురు మైనర్లను యూపీలోని భోపురా బోర్డర్ లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కత్తిని, స్కూటీని రికవరీ చేసుకున్నట్లు డీసీపీ సంజయ్ కమార్ సైన్ తెలిపారు.
నేర ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించేందుకు ఈ నలుగురు మైనర్లు ఇలా చేశారని పోలీస్ విచారణలో తేలింది. హత్యకు ఒక రోజు ముందు బుధవారం భజన్ పురాలోని షానీ బజార్ రోడ్డులో తుపాకీని చూపించి స్కూటీని దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు 20 రోజుల ముందు షాప్ యజమాని షానవాజ్ తో ఈ నలుగురు మైనర్లకు రూ. 500 నోటు విషయంలో గొడవ జరిగింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!