Delhi Fire Accident: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27 మంది మృతి.. 29 మంది మిస్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముండ్కా అగ్ని ప్రమాదంలో ఇప్పటికి 27 మంది మృతి చెందారు. మరోవైపు మిస్సైన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5 గురు పురుషులు కాగా… 24 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు మరనించిన 27 మందిలో కేవలం ఇద్దరిని మాత్రమే గుర్తించారు అధికారులు. మిగతా వారిని గుర్తించేందుకు ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. 25 మంది డీఎన్ఏ సాంపిళ్లను కలెక్ట్ చేశారు.
ఇదిలా ఉంటే తమవారు కనిపించడం లేదంటూ అధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇదంతా చూస్తే మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉంటే బిల్డింగ్ యజమానులు హరీష్ గోయల్, వరుణ్ గోయల్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
ముండ్కా అగ్ని ప్రమాదంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ భవనం నుంచి పొగులు వస్తూనే ఉన్నాయి. ప్రమాదస్థలిని ఢిల్లీ సీఎం సందర్శించారు. ప్రమాదంపై మెజిస్ట్రేట్ తో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణం అయిన వారిని ఎవరిని వదిలిపెట్టం అని విచారణ నిర్వహించి బాధ్యులను తేలుస్తామని, బిల్డింగ్ పర్మిషన్లలో అధికారుల ప్రమేయం ఉన్నా ఉపేక్షించం అని ఢిల్లీ ఔటర్ డిస్ట్రిక్ట్ డీసీపీ సమీర్ శర్మ అన్నారు.
అగ్ని ప్రమాదం జరుగుతున్న సమయంలో 50 మందితో బిల్డింగ్ లోని ఓ ఆఫీస్ లో మీటింగ్ జరుగుతుందని… దీంతో వీరంతా ట్రాప్ అవడంతో ప్రమాదంలో మరనించిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం సీసీ కెమెరాలు, రౌటర్ల్ కు వాడే ప్లాస్టిక్ మెటీరియల్ ఉండటంతో మంటలు సులువుగా వ్యాపించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!