Delhi Fire Accident: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27 మంది మృతి.. 29 మంది మిస్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముండ్కా అగ్ని ప్రమాదంలో ఇప్పటికి 27 మంది మృతి చెందారు. మరోవైపు మిస్సైన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5 గురు పురుషులు కాగా… 24 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు మరనించిన 27 మందిలో కేవలం ఇద్దరిని మాత్రమే గుర్తించారు అధికారులు. మిగతా వారిని గుర్తించేందుకు ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. 25 మంది డీఎన్ఏ సాంపిళ్లను కలెక్ట్ చేశారు.
ఇదిలా ఉంటే తమవారు కనిపించడం లేదంటూ అధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇదంతా చూస్తే మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉంటే బిల్డింగ్ యజమానులు హరీష్ గోయల్, వరుణ్ గోయల్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
ముండ్కా అగ్ని ప్రమాదంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ భవనం నుంచి పొగులు వస్తూనే ఉన్నాయి. ప్రమాదస్థలిని ఢిల్లీ సీఎం సందర్శించారు. ప్రమాదంపై మెజిస్ట్రేట్ తో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణం అయిన వారిని ఎవరిని వదిలిపెట్టం అని విచారణ నిర్వహించి బాధ్యులను తేలుస్తామని, బిల్డింగ్ పర్మిషన్లలో అధికారుల ప్రమేయం ఉన్నా ఉపేక్షించం అని ఢిల్లీ ఔటర్ డిస్ట్రిక్ట్ డీసీపీ సమీర్ శర్మ అన్నారు.
అగ్ని ప్రమాదం జరుగుతున్న సమయంలో 50 మందితో బిల్డింగ్ లోని ఓ ఆఫీస్ లో మీటింగ్ జరుగుతుందని… దీంతో వీరంతా ట్రాప్ అవడంతో ప్రమాదంలో మరనించిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం సీసీ కెమెరాలు, రౌటర్ల్ కు వాడే ప్లాస్టిక్ మెటీరియల్ ఉండటంతో మంటలు సులువుగా వ్యాపించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
-
Pocharam Srinivas Reddy: “అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా”.. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
-
Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
-
Aus vs Ban: బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు కంగారుపడ్డ ఆసీస్ బ్యాటర్స్.!
-
Mitchell Starc History: మిచెల్ స్టార్క్ నయా చరిత్ర.. టెస్టు క్రికెట్లో లెఫ్ట్ ఆర్మ్ రారాజు!
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!