Delhi Fire Accident: ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ముండ్కా అగ్ని ప్రమాదం మరవక ముందే మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముండ్కాలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 29 మంది మరణించగా…మరో కొంత మంది ఆచూకీ గల్లంతైంది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని నరేలా లోని ఓ ప్లాస్టిక్ గ్యాన్యులేషన్ ఫ్యాక్టరీలో శనివారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరి పెద్ద ప్రమాదం ఏర్పడకుండా రక్షించారు. ఇది మీడియం కేటగిరీ అగ్ని ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు. రాహుల్ జైన్ అనే వ్యక్తికి సంబంధించిన ఫ్యాక్టరీగా అధికారులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీ మూసివేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. టార్పలిన్ల తయారీకి వాడే ప్లాస్టిక్ గ్యాన్యుయల్స్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
నరేలా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 22 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురువుతున్నాయని.. ప్రస్తుతం బయట నుంచే మంటలను ఆర్పేస్తున్నామని.. మరో కొన్ని గంటల్లో మంటలు అదుపులోకి వస్తాయని ఢిల్లీ అగ్నమాపక ఏడీఓ ఏకే వర్మ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం జరగలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
Also Read
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే వరస అగ్నిప్రమాదాలతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జరిగిన ముండ్కా అగ్ని ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా అందర్ని కలిచివేసింది. ఏకంగా 29 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఢిల్లీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. పలువురి ఆచూకీ ఇంకా లభించలేదు. శవాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ కెమెరాలు, రౌటర్లు తయారు చేసే ఓ మూడు అంతస్తుల భవనంలో ప్రమాదం జరిగింది. ప్రజలు తప్పించుకుపోవడానికి కూడా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మరణించిన వారికి ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు పరిహారం అందించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం మరణించిన వారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారంగా ప్రకటించింది.
తాజావార్తలు
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!