Delhi Fire Accident: ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ముండ్కా అగ్ని ప్రమాదం మరవక ముందే మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముండ్కాలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 29 మంది మరణించగా…మరో కొంత మంది ఆచూకీ గల్లంతైంది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని నరేలా లోని ఓ ప్లాస్టిక్ గ్యాన్యులేషన్ ఫ్యాక్టరీలో శనివారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరి పెద్ద ప్రమాదం ఏర్పడకుండా రక్షించారు. ఇది మీడియం కేటగిరీ అగ్ని ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు. రాహుల్ జైన్ అనే వ్యక్తికి సంబంధించిన ఫ్యాక్టరీగా అధికారులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీ మూసివేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. టార్పలిన్ల తయారీకి వాడే ప్లాస్టిక్ గ్యాన్యుయల్స్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
నరేలా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 22 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురువుతున్నాయని.. ప్రస్తుతం బయట నుంచే మంటలను ఆర్పేస్తున్నామని.. మరో కొన్ని గంటల్లో మంటలు అదుపులోకి వస్తాయని ఢిల్లీ అగ్నమాపక ఏడీఓ ఏకే వర్మ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం జరగలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
Also Read
- Meenakshi Natarajan: "మేము జోక్యం చేసుకోలేం".. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
- Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
ఇదిలా ఉంటే వరస అగ్నిప్రమాదాలతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జరిగిన ముండ్కా అగ్ని ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా అందర్ని కలిచివేసింది. ఏకంగా 29 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఢిల్లీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. పలువురి ఆచూకీ ఇంకా లభించలేదు. శవాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ కెమెరాలు, రౌటర్లు తయారు చేసే ఓ మూడు అంతస్తుల భవనంలో ప్రమాదం జరిగింది. ప్రజలు తప్పించుకుపోవడానికి కూడా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మరణించిన వారికి ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు పరిహారం అందించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం మరణించిన వారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారంగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
-
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
-
Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్లోపు కొనేయండి..
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!