Delhi Fire Accident: ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ముండ్కా అగ్ని ప్రమాదం మరవక ముందే మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముండ్కాలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 29 మంది మరణించగా…మరో కొంత మంది ఆచూకీ గల్లంతైంది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని నరేలా లోని ఓ ప్లాస్టిక్ గ్యాన్యులేషన్ ఫ్యాక్టరీలో శనివారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరి పెద్ద ప్రమాదం ఏర్పడకుండా రక్షించారు. ఇది మీడియం కేటగిరీ అగ్ని ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు. రాహుల్ జైన్ అనే వ్యక్తికి సంబంధించిన ఫ్యాక్టరీగా అధికారులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీ మూసివేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. టార్పలిన్ల తయారీకి వాడే ప్లాస్టిక్ గ్యాన్యుయల్స్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
నరేలా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 22 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురువుతున్నాయని.. ప్రస్తుతం బయట నుంచే మంటలను ఆర్పేస్తున్నామని.. మరో కొన్ని గంటల్లో మంటలు అదుపులోకి వస్తాయని ఢిల్లీ అగ్నమాపక ఏడీఓ ఏకే వర్మ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం జరగలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
ఇదిలా ఉంటే వరస అగ్నిప్రమాదాలతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జరిగిన ముండ్కా అగ్ని ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా అందర్ని కలిచివేసింది. ఏకంగా 29 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఢిల్లీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. పలువురి ఆచూకీ ఇంకా లభించలేదు. శవాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ కెమెరాలు, రౌటర్లు తయారు చేసే ఓ మూడు అంతస్తుల భవనంలో ప్రమాదం జరిగింది. ప్రజలు తప్పించుకుపోవడానికి కూడా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మరణించిన వారికి ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు పరిహారం అందించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం మరణించిన వారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారంగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!