Land For Jobs Case: లాలూ యాదవ్, రబ్రీదేవి, తేజస్వీయాదవ్కి ఢిల్లీ కోర్టు సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land-For-Jobs Case: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, వీరి కుమారుడు, ప్రస్తుత బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ లకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ వారిపై దాఖలైన ఛార్జిషీట్ ని పరిగణలోకి తీసుకున్నారు. అవినీతి, నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతో సహా పలు నేరాలను ప్రాథమిక సాక్ష్యాలు చూపించాయని అన్నారు. నిందితులను అరెస్ట్ చేయకుండా చార్జిషీటు దాఖలు చేశారని పేర్కొంటూ అక్టోబర్ 4న తమ ముందు హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు.
Read Also: Chandrayaan 3: ల్యాండర్, రోవర్ నుంచి నో సిగ్నల్.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఏమన్నారంటే..?
Also Read
ఇటీవల ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ని విచారించేందుకు అవసరమైన అనుమతులను పొందినట్లు సీబీఐ అధికారులు కోర్టుకు తెలియజేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ జూలై 3న ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుతో పాటు దాణా కుంభకోణంలో లాలూ యాదవ్ బెయిల్ పై బయట ఉన్నారు. ప్రస్తుతం సీబీఐ ఈ కేసులో రెండో ఛార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి దాంట్లో తేజస్వీ యాదవ్ ని నిందితుడిగా పేర్కొంది. లాలూ, రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ తో పాటు మరో 14 మందిని సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది.
2004-2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జబల్ పూర్ రైల్వేలోని వెస్ట్ సెంట్రల్ జోన్ లో జరిగిన గ్రూప్-డీ నియమకాల్లో అవకతవకలకు పాల్పడ్డాడు. ఉద్యోగానికి, భూమి ఇవ్వడం ద్వారా పలువురు అక్రమంగా ఉద్యోగాలు పొందేందుకు లాలూ ప్రసాద్ తో పాటు రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ కారణమయ్యారని అభియోగాలను ఎదర్కొంటున్నారు. మే 18, 2022లో వీరి ముగ్గురితో పాటు 15 మందిపై కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!