Land For Jobs Case: లాలూ యాదవ్, రబ్రీదేవి, తేజస్వీయాదవ్కి ఢిల్లీ కోర్టు సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land-For-Jobs Case: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, వీరి కుమారుడు, ప్రస్తుత బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ లకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ వారిపై దాఖలైన ఛార్జిషీట్ ని పరిగణలోకి తీసుకున్నారు. అవినీతి, నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతో సహా పలు నేరాలను ప్రాథమిక సాక్ష్యాలు చూపించాయని అన్నారు. నిందితులను అరెస్ట్ చేయకుండా చార్జిషీటు దాఖలు చేశారని పేర్కొంటూ అక్టోబర్ 4న తమ ముందు హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు.
Read Also: Chandrayaan 3: ల్యాండర్, రోవర్ నుంచి నో సిగ్నల్.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఏమన్నారంటే..?
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
ఇటీవల ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ని విచారించేందుకు అవసరమైన అనుమతులను పొందినట్లు సీబీఐ అధికారులు కోర్టుకు తెలియజేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ జూలై 3న ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుతో పాటు దాణా కుంభకోణంలో లాలూ యాదవ్ బెయిల్ పై బయట ఉన్నారు. ప్రస్తుతం సీబీఐ ఈ కేసులో రెండో ఛార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి దాంట్లో తేజస్వీ యాదవ్ ని నిందితుడిగా పేర్కొంది. లాలూ, రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ తో పాటు మరో 14 మందిని సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది.
2004-2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జబల్ పూర్ రైల్వేలోని వెస్ట్ సెంట్రల్ జోన్ లో జరిగిన గ్రూప్-డీ నియమకాల్లో అవకతవకలకు పాల్పడ్డాడు. ఉద్యోగానికి, భూమి ఇవ్వడం ద్వారా పలువురు అక్రమంగా ఉద్యోగాలు పొందేందుకు లాలూ ప్రసాద్ తో పాటు రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ కారణమయ్యారని అభియోగాలను ఎదర్కొంటున్నారు. మే 18, 2022లో వీరి ముగ్గురితో పాటు 15 మందిపై కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..