Land For Jobs Case: లాలూ యాదవ్, రబ్రీదేవి, తేజస్వీయాదవ్కి ఢిల్లీ కోర్టు సమన్లు..
Land-For-Jobs Case: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, వీరి కుమారుడు, ప్రస్తుత బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ లకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ వారిపై దాఖలైన ఛార్జిషీట్ ని పరిగణలోకి తీసుకున్నారు. అవినీతి, నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతో సహా పలు నేరాలను ప్రాథమిక సాక్ష్యాలు చూపించాయని అన్నారు. నిందితులను అరెస్ట్ చేయకుండా చార్జిషీటు దాఖలు చేశారని పేర్కొంటూ అక్టోబర్ 4న తమ ముందు హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు.
Read Also: Chandrayaan 3: ల్యాండర్, రోవర్ నుంచి నో సిగ్నల్.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఏమన్నారంటే..?
Also Read
ఇటీవల ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ని విచారించేందుకు అవసరమైన అనుమతులను పొందినట్లు సీబీఐ అధికారులు కోర్టుకు తెలియజేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ జూలై 3న ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుతో పాటు దాణా కుంభకోణంలో లాలూ యాదవ్ బెయిల్ పై బయట ఉన్నారు. ప్రస్తుతం సీబీఐ ఈ కేసులో రెండో ఛార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి దాంట్లో తేజస్వీ యాదవ్ ని నిందితుడిగా పేర్కొంది. లాలూ, రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ తో పాటు మరో 14 మందిని సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది.
2004-2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జబల్ పూర్ రైల్వేలోని వెస్ట్ సెంట్రల్ జోన్ లో జరిగిన గ్రూప్-డీ నియమకాల్లో అవకతవకలకు పాల్పడ్డాడు. ఉద్యోగానికి, భూమి ఇవ్వడం ద్వారా పలువురు అక్రమంగా ఉద్యోగాలు పొందేందుకు లాలూ ప్రసాద్ తో పాటు రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ కారణమయ్యారని అభియోగాలను ఎదర్కొంటున్నారు. మే 18, 2022లో వీరి ముగ్గురితో పాటు 15 మందిపై కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో