Delhi Car Blast : మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
- ఢిల్లీ పేలుడులో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
- మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
- శాశ్వత అంగవైకల్యం కలిగినవారికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
- క్షతగాత్రులకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
- బాధితులకు అండగా ఉంటామన్న ఢిల్లీ సర్కార్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన తీవ్ర స్థాయి పేలుడు ఢిల్లీవాసులను భయాందోళనలకు గురిచేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో సంభవించిన ఈ పేలుడులో 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం సుమారు 6:52 గంటల సమయంలో, సాధారణంగా కార్యాలయాలు ముగిసి ప్రజలు ఇళ్లకు చేరే సమయంలో ఈ దారుణం జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో, రద్దీగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మెల్లగా కదులుతున్న ఒక కారులో ఉన్నట్టుండి పెను శబ్దం చేస్తూ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వలన సమీపంలో ఉన్న అనేక వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. మృతులలో, గాయపడిన వారిలో కొందరు సమీపంలోని పాదచారులు, ఇతర వాహనాలలో ప్రయాణించేవారు ఉన్నారు. గాయపడిన 20 మందిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.. వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఇది ఉగ్రవాద చర్యనా కాదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రాంతం ఎర్రకోట (లాల్ ఖిలా) కు సమీపంలో ఉండటం, అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రమైన చాందినీ చౌక్ దారిలో ఉండటం వల్ల ఢిల్లీ భద్రతా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ విపత్తుపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, మృతులకు, క్షతగాత్రులకు ఆర్థిక సహాయం (ఎక్స్ గ్రేషియా) ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా బాధితులకు అండగా ఉంటామని ఢిల్లీ సర్కార్ వెల్లడించింది. ప్రస్తుతం, ఢిల్లీలోని కీలక ప్రాంతాలలో అధిక భద్రత అమలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల నుండి దర్యాప్తు కొనసాగుతోంది.
Priyank Kharge: అమిత్ షాకు మోడీ రహస్యాలు తెలుసు.. కాంగ్రెస్ మంత్రి ఆరోపణలు..
తాజావార్తలు
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
-
Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
-
Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
-
Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!