Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror Threat to Delhi BJP HQ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ (DDU) మార్గ్లోని భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్ర కార్యాలయంతో పాటు సమీపంలోని కీలక ప్రభుత్వ సంస్థలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమై బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను, పారామిలటరీ దళాలను మోహరించాయి.
ఆత్మాహుతి దాడులు, కారు బాంబులతో కుట్ర!
నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు ఈసారి అత్యంత విధ్వంసకర పద్ధతులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడులు, కారు బాంబు పేలుళ్లు, కాల్పులకు తెగబడటం లేదా ఐఈడీలను అమర్చడం వంటి కుట్రలు పన్నుతున్నట్లు హెచ్చరికలు అందాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే స్పందించేలా స్పెషల్ ఫోర్స్ రెడీగా ఉంది.
Also Read
- El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
- Delhi: ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో సంచలన తీర్పు.. మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్కు జీవిత ఖైదు
- PM-KISAN Scheme: రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. మరో ఐదేళ్లు పీఎం-కిసాన్
- Central Cabinet Decision: సముద్ర మంథన్ ప్రాజెక్ట్ ఆమోదం.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
ఢిల్లీని వణికించిన గత దాడులు..
దేశ రాజధాని ఎప్పుడూ ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉందనడానికి గతంలో జరిగిన దాడులే నిదర్శనం. నిఘా వర్గాలు ఇప్పుడు అప్రమత్తం కావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే.. డిసెంబర్ 13న ప్రజాస్వామ్య దేవాలయంలాగా భావించే పార్లమెంట్పై ఉగ్రవాదులు ఆటోమేటిక్ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో భద్రతా బలగాలు ఉగ్రవాదులను హతమార్చినప్పటికీ, పలువురు జవాన్లు వీరమరణం పొందారు. 2005లో దీపావళి, ఈద్ పండుగలకు ముందు సరోజినీ నగర్, పహార్గంజ్, గోవింద్పురిలలో చోటుచేసుకున్న వరుస పేలుళ్లు ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నాయి. 2011లో ఢిల్లీ హైకోర్టు గేట్ నంబర్ 5 వెలుపల జరిగిన భారీ పేలుడులో అనేకమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
2008లో ఢిల్లీ నగరం నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్ వంటి కీలక వాణిజ్య ప్రాంతాల్లో ఒకదాని వెనుక ఒకటిగా జరిగిన పేలుళ్లు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. 2010లో జామా మసీదులో విదేశీ పర్యాటకులనే లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. గతేడాది నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో పలు వాహనాలు ధ్వంసం కావడమే కాకుండా, సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కార్యాలయానికి ముప్పు ఉందన్న వార్త ఢిల్లీ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ప్రస్తుతం డీడీయూ మార్గ్ పరిసరాల్లోని అణువణువూ గాలిస్తూ, అనుమానిత వ్యక్తులపై అధికారులు నిఘా పెంచారు.
తాజావార్తలు
-
The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్నెస్కు రెడీ అవ్వండి!
-
Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
-
CM Revanth Reddy : పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు TOMCOMదే బాధ్యత
-
Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
-
Team India: రుతురాజ్, పటీదార్లకు ఘోర పరాభవం.. రికార్డులు ఉన్నా కనీసం కనుచూపు మేరలో కూడా లేరు..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!