Delhi-AAP: ఢిల్లీ ఆక్రమణల కూల్చివేత… రేపు ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. బుల్డోజర్లలో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ బుల్డోజర్ కూల్చివేతల వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొన్ని ఢిల్లీలోని కొన్ని ఏరియాల్లో కూల్చివేతలకు వ్యతిరేఖంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తీవ్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార ఆప్, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు ఎంతగా వ్యతిరేఖించినా ఢిల్లీ మున్సిపల్ అధికారులు తగ్గడం లేదు. పోలీసులు, సీఆర్ఫీఎఫ్ భద్రత నడుమ ఆక్రమణలను కూల్చివేస్తున్నారు.
ఇటీవల ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ, షాహీన్ బాగ్ ఏరియాల్లో కూల్చివేతలపై తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఇదిలా ఉంటే గురువారం మదన్ పూర్ ఖాదర్ కళ్యాణ్ నగర్ కూల్చివేతల సమయంలో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ వ్యతిరేఖంగా ఆందోళన చేశారు. క్రమంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయనపై హిస్టరీ షీట్ బుక్ చేశారు. మొత్తం 18 ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు. తాజాా ఈరోజు శ్యాంపూర్ ఏరియాల్లో ఆక్రమణలను కూల్చివేశారు.
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ఇదిలా ఉండే ఢిల్లీ నగర వ్యాప్తంగా కూల్చివేతలపై సీఎం కేజ్రీవాల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆప్ ఎమ్మెల్యేలు అందరూ మీటింగ్ కు రావాల్సిందిగా శుక్రవారం ఆదేశించారు. ఆప్ ఎమ్మెల్యే అమనుతుల్లా ఖాన్ ను అరెస్ట్ చేసిన ఒక రోజు తర్వాత సీఎం కేజ్రీవాల్ ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.
మరోవైపు బుల్డోజర్ల చర్యపై, ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేత విధ్వంసాన్ని ఆపాలంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. బీజేపీ బుల్డోజర్ రాజకీయాలను ఖండించారు. కాగా.. హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలోని ఓ వర్గం వారు శోభాయాత్రపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆందోళనకారులు అక్రమ నిర్మాణాలపై నుంచి రాళ్లు రువ్వినట్లు అధికారులు గుర్తించడంతో రాజధానిలో బుల్డోజర్ల యాక్షన్ ప్రారంభం అయింది.
తాజావార్తలు
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
-
Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
-
FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
-
R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?