Delhi-AAP: ఢిల్లీ ఆక్రమణల కూల్చివేత… రేపు ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. బుల్డోజర్లలో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ బుల్డోజర్ కూల్చివేతల వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొన్ని ఢిల్లీలోని కొన్ని ఏరియాల్లో కూల్చివేతలకు వ్యతిరేఖంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తీవ్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార ఆప్, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు ఎంతగా వ్యతిరేఖించినా ఢిల్లీ మున్సిపల్ అధికారులు తగ్గడం లేదు. పోలీసులు, సీఆర్ఫీఎఫ్ భద్రత నడుమ ఆక్రమణలను కూల్చివేస్తున్నారు.
ఇటీవల ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ, షాహీన్ బాగ్ ఏరియాల్లో కూల్చివేతలపై తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఇదిలా ఉంటే గురువారం మదన్ పూర్ ఖాదర్ కళ్యాణ్ నగర్ కూల్చివేతల సమయంలో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ వ్యతిరేఖంగా ఆందోళన చేశారు. క్రమంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయనపై హిస్టరీ షీట్ బుక్ చేశారు. మొత్తం 18 ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు. తాజాా ఈరోజు శ్యాంపూర్ ఏరియాల్లో ఆక్రమణలను కూల్చివేశారు.
Also Read
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ఇదిలా ఉండే ఢిల్లీ నగర వ్యాప్తంగా కూల్చివేతలపై సీఎం కేజ్రీవాల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆప్ ఎమ్మెల్యేలు అందరూ మీటింగ్ కు రావాల్సిందిగా శుక్రవారం ఆదేశించారు. ఆప్ ఎమ్మెల్యే అమనుతుల్లా ఖాన్ ను అరెస్ట్ చేసిన ఒక రోజు తర్వాత సీఎం కేజ్రీవాల్ ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.
మరోవైపు బుల్డోజర్ల చర్యపై, ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేత విధ్వంసాన్ని ఆపాలంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. బీజేపీ బుల్డోజర్ రాజకీయాలను ఖండించారు. కాగా.. హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలోని ఓ వర్గం వారు శోభాయాత్రపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆందోళనకారులు అక్రమ నిర్మాణాలపై నుంచి రాళ్లు రువ్వినట్లు అధికారులు గుర్తించడంతో రాజధానిలో బుల్డోజర్ల యాక్షన్ ప్రారంభం అయింది.
తాజావార్తలు
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!