Site icon NTV Telugu

ధర్బంగా బ్లాస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు…

ధర్బంగా బ్లాస్ట్ రిమాండ్ రిపోర్ట్ కీలక అంశాలు వెలుగు చూశాయి. అయితే ఆ ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్ట్ లో హాజరు పరచగా.. అనంతరం రిమాండ్ కు తరలించారు. ధర్బంగా బ్లాస్ట్ కేసుల నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్ లకు పాకిస్థాన్ ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. లష్కరే తోయిబా కు చెందిన ముఖ్యనేత ఆదేశాల మేరకే హైద్రాబాద్ కు వచ్చారు మాలిక్ బ్రదర్స్. సికింద్రాబాద్ ధర్బంగా ఎక్స్ప్రెస్ లో బాంబు పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్రపన్నారు. పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఐఎస్ఐ ముఖ్య నేత ఇక్బాల్ ఈ వ్యూహ రచన చేసాడు.

2012 లో పాకిస్థాన్ వెళ్లిన ఇమ్రాన్ మాలిక్ ను ఉగ్ర కుట్ర కు శిక్షణ ఇచ్చారు ఇక్బాల్. మాలిక్ సోదరులతో పాటు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సలీం, ఖాఫిల్ కు కూడా ఇక్బాల్ శిక్షణ ఇచ్చాడు. 2016 లో ఈ నలుగురు దుబాయ్ కి వెళ్లినట్టు గుర్తించిన ఎన్ఐఏ ఇక్బాల్ తో తరచూ సోషల్ మీడియా లో సంభాషణ చేస్తూనే ఉన్నారు ఇమ్రాన్ మాలిక్. బాంబ్ తయారీలో రసాయనాల వాడకం పై యూ ట్యూబ్ లో వీడియోల లింక్ ను ఇమ్రాన్ కు పంపిన ఇక్బాల్… పేలుడు కు సల్ఫ్యూరిక్ గా యాసిడ్,నైట్రిక్ యాసిడ్, వైట్ షుగర్ ఉపయోగించారు మాలిక్ బ్రదర్స్. హైద్రాబాద్ లోని చిక్కడ పల్లి, హాబీబీనగర్ లో ముడిసరుకులు కొన్న మాలిక్ బ్రదర్స్… మొదట ఇంట్లో ట్రైల్స్ నిర్వచించారు ఉగ్రవాదులు.

అయితే ఈ ట్రైల్స్ సక్సెస్ కావడంతో ఒక టానిక్ సీసా లో రసాయనాలతో మూడింటిని ఉపయోగించి పార్సిల్ లో అమర్చిన మాలిక్ సోదరులు… 16 గంటల లోపు ట్రైన్ లో పేలుడు జరిగేలా స్కెచ్ వేశారు. పేలుడు రసాయనాన్ని 50 మిలి లీటర్ల పెట్టడంతో పెద్ద గా భారీ కుట్ర ఫెయిల్ అయ్యింది. దర్భంగా స్టేషన్ లో పార్సిల్ దించే సమయంలో పార్సిల్ కింద పడటంతో పేలుడు సంభవించింది. పార్శిల్ పంపిన వ్యక్తి పేరు సుఫియాన్ పాన్ కార్డ్ ను వాట్సప్ లో ఇమ్రాన్ కు పంపిన ఇక్బాల్… హైదరాబాధ్ మల్లేపల్లిలో నివాసం ఏర్పచుకున్నారు మాలిక్ ఉగ్రవాద సోదరులు. భారీ పేలుడుకు ముందు ఇది శాంపిల్ కుట్రనా అనే అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఐఏ దృష్టి మలిచి మరో విధ్వంసం కు ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి.

Exit mobile version