Covishield: కోవిషీల్డ్ మరణాలకు కారణమైందా..? కేసు వేసేందుకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covishield: ఆస్ట్రాజెనికా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ కొందరిపై ప్రతికూల దుష్ప్రభావాలు చూపించిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ పిల్లలు మరణించారని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీరంతా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు ఇచ్చారు. అయితే, ఈ వ్యాక్సిన్ రోల్ అవుట్లో పాల్గొన్న ప్రభుత్వ సంస్థల అధికారులపై, సీరం ఇన్స్టిట్యూడ్ ఆఫ్ ఇండియాపై దావా వేయాలని దేశవ్యాప్తంగా బాధిత తల్లిదండ్రుల బృందం భావిస్తోంది.
Read Also: High Tension: గన్నవరంలో హైటెన్షన్ వాతావరణం.. జనసేన- వైసీపీ మధ్య ఘర్షణ..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రాజెనికా రూపొందించిన కోవిట్ టీకా కొన్ని సందర్భాల్లో ప్రాణాంతక థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో రక్తం గడ్డకట్టే ప్రమాదకరమైన పరిస్థితికి కారణమవుతుందని UK కోర్టులో ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఆ తర్వాత పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు కేసు వేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్కు చెందిన రచన గంగూ, కోయంబత్తూరుకు చెందిన వేణుగోపాలన్ గోవిందన్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. తమ ప్రియమైన వారిని కోల్పోయిన 8 కుటుంబాలు కలిసి వస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరికొన్ని కుటుంబాలు వీరితే చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ 8 కుటుంబాలు బెంగళూరు, హైదరాబాద్, కేరళ, ముంబై, కోయంబత్తూర్, కపుర్తలాకు చెందినవి. తల్లిదండ్రులు తయారీ సంస్థతో పాటు ప్రభుత్వం సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!