3 వారాల్లో గరిష్ట స్థాయికి కరోనా.. తాజా రీసెర్చ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న సమయంలో.. పలు రకాల రీసెర్చ్లు కోవిడ్ తీవ్రతను అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. దేశంలో క్రమంగా కోవిడ్ మీటర్ మరోసారి పైకి పరుగులు పెడుతోన్న సమయంలో.. ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎబ్బీఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.. భారత్లో కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది ఎస్బీఐ రీసెర్చ్.. ఇప్పటికే కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది.. సిటీల్లో ప్రారంభమై ఇప్పుడు గ్రామీణకు కూడా పాకిపోయింది. అయితే, ఈ తీవ్రత ఎక్కువ కాలం ఉండకపోవచ్చని, వచ్చే మూడు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చన్నది అంచనా వేస్తోది ఎస్బీఐ.
Read Also: కోవిడ్పై కేంద్రం ఆందోళన.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
Also Read
- Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
- Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
ఇక, ముంబైలో ఈ నెల 7న 20,971 కొత్త కేసులు వెలుగు చూశాయి.. ఈ సీజన్లో ఇదే గరిష్ఠ స్థాయి.. ముంబైలో కోవిడ్ కేసుల సంఖ్య గరిష్ఠస్థాయికి చేరిన 2-3 వారాల్లో జాతీయ గరిష్ఠ స్థాయి నమోదయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ పేర్కొంది.. ఇక, ఈ నివేదికలోని కీలక అంశాలను ఓసారి పరిశీలిస్తే.. కోవిడ్ కేసులు తారాస్థాయికి చేరిన పలు దేశాల్లోని పరిస్థితులను పరిగణలోకి తీసుకుంది.. యూఏఈ, చిలీ, సింగపూర్, చైనా తదితర దేశాలు 80 శాతానికి పైగా జనాభాకు టీకాలు వేశారని.. దీంతో, కొత్త కేసులు పెరుగుతున్నా మరణాల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొంది.. ఇక, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ గరిష్ఠ స్థాయికి చేరి.. మళ్లీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు తెలిపింది.. ఈ దేశాల్లో గరిష్ఠ స్థాయి నమోదు కావడానికి సగటున 54 రోజుల సమయం పట్టిందని పేర్కొన్న ఎస్బీఐ.. భారత్లో కేసుల సంఖ్య పెరగటం డిసెంబర్ 29వ తేదీ నుంచి మొదలైంది.. ఆ తర్వాత ఈ నెల 17వ తేదీకి వచ్చేసరికి రోజువారి కేసుల సంఖ్య 2.38 లక్షలకు చేరింది.. ఈ లెక్కన మూడు వారాల్లో కోవిడ్ గరిష్ఠస్థాయిని తాకుతుందని అంచనా వేసింది ఎస్బీఐ. ఇక, దేశంలో 64 శాతం ప్రజలకు ఇప్పటికే రెండో డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు.. మరోవైపు.. ప్రజలు పెద్ద ఎత్తున కోవిడ్ బారినపడినా.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్యమాత్రం తగ్గుతుంది.. దీనికి వ్యాక్సినేషనే కారణంగా చెబుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
-
160cc Bikes: మంచి మైలేజ్ కోసం చూస్తున్నారా?.. 160cc సెగ్మెంట్లో బెస్ట్ బైక్లు ఇవే..!
-
Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్లోనే కాదు.. పాకిస్థాన్లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pant LSG Journey: ఎఫ్ వర్డ్, విమర్శలు, అసంతృప్తి, లీడర్షిప్ రీసెట్.. ఎల్ఎస్జీలో పంత్ ప్రయాణం సాగిందిలా!
ట్రెండింగ్
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!