IND vs Ban: పాక్తో పాటు బంగ్లాదేశ్పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్..
- పహల్గామ్ ఉగ్రదాడితో భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత..
- పాకిస్తాన్ ఆంక్షలు విధిస్తున్న భారత ప్రభుత్వం..
- బంగ్లాదేశ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈశాన్య ప్రజల డిమాండ్..
- గంగా జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలని అస్సాం సీఎం వినతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs Ban: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్పై కఠినమైన చర్యలు విధిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ కు దగ్గర అవుతున్న బంగ్లాదేశ్పై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఈశాన్య భారతదేశంలోని కీలక రాజకీయ నాయకులు, పలు పార్టీలు పిలుపునిచ్చాయి. అయితే పాక్- బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాల గురించి అధికారులను అప్రమత్తం చేసినట్లు గత వారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పహల్గామ్ లో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడి తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ తో లష్కరే తోయిబా నేతలు సమావేశం కావడం గమనార్హం.
Read Also: Buffalo Milk vs Cow Milk: గేదె పాలా లేక ఆవు పాలా..? ఏవి తాగితే ఎక్కువ ప్రయోజనం.!
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఇక, బీజేపీ నేత నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. లష్కర్-ఎ-తోయిబా నేతలు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది అని తేల్చి చెప్పారు. ఉగ్రవాద చొరబాట్లను ఆపడానికి, భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులను మరింత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా 1996లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న గంగా జలాల ఒప్పందాన్ని తప్పుపట్టారు. పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని కేంద్రం నిలిపివేసినట్లే.. బంగ్లాదేశ్ తో చేసుకున్న గంగా జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలని పేర్కొన్నారు.
Read Also: AjithKumar : పద్మ భూషణ్ అందుకున్న అజిత్ కుమార్..
అలాగే, బీహార్, పశ్చిమ బెంగాల్ సీఎంలు నీతిశ్ కుమార్, మమతా బెనర్జీలు కూడా తీస్తా జల ఒప్పందాన్ని వ్యతిరేకించారు అని అస్సాం ముఖ్యమత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. దీంతో పాటు బ్రహ్మపుత్ర నది నీటిని బంగ్లాదేశ్లోకి వెళ్లడానికి నిరాకరించారు. ఎంతకాలం పాములకు నీళ్లు అందిస్తాం?.. వాటిని అణిచివేయాల్సిన సమయం ఆసన్నమైంది అని బిశ్వ శర్మ తెలిపారు. భారతదేశం మొత్తం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాపై నమ్మకం పెట్టుకున్నాయి.. త్వరగా బంగ్లాదేశ్ తో చేసుకున్న గంగా- బ్రహ్మపుత్ర ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్నారు.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
-
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!