IND vs Ban: పాక్తో పాటు బంగ్లాదేశ్పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్..
- పహల్గామ్ ఉగ్రదాడితో భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత..
- పాకిస్తాన్ ఆంక్షలు విధిస్తున్న భారత ప్రభుత్వం..
- బంగ్లాదేశ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈశాన్య ప్రజల డిమాండ్..
- గంగా జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలని అస్సాం సీఎం వినతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs Ban: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్పై కఠినమైన చర్యలు విధిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ కు దగ్గర అవుతున్న బంగ్లాదేశ్పై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఈశాన్య భారతదేశంలోని కీలక రాజకీయ నాయకులు, పలు పార్టీలు పిలుపునిచ్చాయి. అయితే పాక్- బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాల గురించి అధికారులను అప్రమత్తం చేసినట్లు గత వారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పహల్గామ్ లో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడి తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ తో లష్కరే తోయిబా నేతలు సమావేశం కావడం గమనార్హం.
Read Also: Buffalo Milk vs Cow Milk: గేదె పాలా లేక ఆవు పాలా..? ఏవి తాగితే ఎక్కువ ప్రయోజనం.!
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
ఇక, బీజేపీ నేత నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. లష్కర్-ఎ-తోయిబా నేతలు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది అని తేల్చి చెప్పారు. ఉగ్రవాద చొరబాట్లను ఆపడానికి, భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులను మరింత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా 1996లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న గంగా జలాల ఒప్పందాన్ని తప్పుపట్టారు. పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని కేంద్రం నిలిపివేసినట్లే.. బంగ్లాదేశ్ తో చేసుకున్న గంగా జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలని పేర్కొన్నారు.
Read Also: AjithKumar : పద్మ భూషణ్ అందుకున్న అజిత్ కుమార్..
అలాగే, బీహార్, పశ్చిమ బెంగాల్ సీఎంలు నీతిశ్ కుమార్, మమతా బెనర్జీలు కూడా తీస్తా జల ఒప్పందాన్ని వ్యతిరేకించారు అని అస్సాం ముఖ్యమత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. దీంతో పాటు బ్రహ్మపుత్ర నది నీటిని బంగ్లాదేశ్లోకి వెళ్లడానికి నిరాకరించారు. ఎంతకాలం పాములకు నీళ్లు అందిస్తాం?.. వాటిని అణిచివేయాల్సిన సమయం ఆసన్నమైంది అని బిశ్వ శర్మ తెలిపారు. భారతదేశం మొత్తం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాపై నమ్మకం పెట్టుకున్నాయి.. త్వరగా బంగ్లాదేశ్ తో చేసుకున్న గంగా- బ్రహ్మపుత్ర ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!