IND vs Ban: పాక్తో పాటు బంగ్లాదేశ్పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్..
- పహల్గామ్ ఉగ్రదాడితో భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత..
- పాకిస్తాన్ ఆంక్షలు విధిస్తున్న భారత ప్రభుత్వం..
- బంగ్లాదేశ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈశాన్య ప్రజల డిమాండ్..
- గంగా జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలని అస్సాం సీఎం వినతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs Ban: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్పై కఠినమైన చర్యలు విధిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ కు దగ్గర అవుతున్న బంగ్లాదేశ్పై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఈశాన్య భారతదేశంలోని కీలక రాజకీయ నాయకులు, పలు పార్టీలు పిలుపునిచ్చాయి. అయితే పాక్- బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాల గురించి అధికారులను అప్రమత్తం చేసినట్లు గత వారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పహల్గామ్ లో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడి తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ తో లష్కరే తోయిబా నేతలు సమావేశం కావడం గమనార్హం.
Read Also: Buffalo Milk vs Cow Milk: గేదె పాలా లేక ఆవు పాలా..? ఏవి తాగితే ఎక్కువ ప్రయోజనం.!
Also Read
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. "బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు"
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
ఇక, బీజేపీ నేత నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. లష్కర్-ఎ-తోయిబా నేతలు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది అని తేల్చి చెప్పారు. ఉగ్రవాద చొరబాట్లను ఆపడానికి, భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులను మరింత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా 1996లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న గంగా జలాల ఒప్పందాన్ని తప్పుపట్టారు. పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని కేంద్రం నిలిపివేసినట్లే.. బంగ్లాదేశ్ తో చేసుకున్న గంగా జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలని పేర్కొన్నారు.
Read Also: AjithKumar : పద్మ భూషణ్ అందుకున్న అజిత్ కుమార్..
అలాగే, బీహార్, పశ్చిమ బెంగాల్ సీఎంలు నీతిశ్ కుమార్, మమతా బెనర్జీలు కూడా తీస్తా జల ఒప్పందాన్ని వ్యతిరేకించారు అని అస్సాం ముఖ్యమత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. దీంతో పాటు బ్రహ్మపుత్ర నది నీటిని బంగ్లాదేశ్లోకి వెళ్లడానికి నిరాకరించారు. ఎంతకాలం పాములకు నీళ్లు అందిస్తాం?.. వాటిని అణిచివేయాల్సిన సమయం ఆసన్నమైంది అని బిశ్వ శర్మ తెలిపారు. భారతదేశం మొత్తం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాపై నమ్మకం పెట్టుకున్నాయి.. త్వరగా బంగ్లాదేశ్ తో చేసుకున్న గంగా- బ్రహ్మపుత్ర ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్నారు.
తాజావార్తలు
-
Danish Kaneria: “రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?”.. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
RAW NTR: ఊహించని ట్విస్ట్.. ‘రా ఎన్టీఆర్’కు గుడ్బై.. అసలు ఏమైంది?
-
Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. “బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు”
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!