Sanjay Raut: అలా అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్కి మరిన్ని కష్టాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: అలా అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్కి మరిన్ని కష్టాలు..ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలో విజయంతో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నట్లైంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓడిపోయింది. 2024 లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గురించి శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన మౌత్ పీస్ సామ్నా పత్రికలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈవీఎంలపై సందేహాన్ని లేవనెత్తారు. ప్రధాని నరేంద్రమోడీకి అనుకూలంగా రాజకీయాలు చేసే వ్యక్తులు గాంధీ కుటుంబం చుట్టూ ఉంటే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మరిన్ని కష్టాలు తప్పవని సంజయ్ రౌత్ ఆదివారం హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీ చీఫ్ కమల్నాథ్ని ఉద్దేశించి రౌత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
Read Also: Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరంలో పూజారిగా యూపీ విద్యార్థి..ఎవరీ మోహిత్ పాండే..?
మధ్యప్రదేశ్ ఓట్ల లెక్కింపు సమయంలో పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్199 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని, ఈవీఎంలో ఓట్లు లెక్కించే సమయంలో పరిస్థితి మారిపోయిందని అన్నారు. ప్రధాని మోడీ గెలుపు మాయాజాలం మూడు రాష్ట్రాల్లో పనిచేసిందని, తెలంగాణలో మాత్రం పనిచేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ ఓడించలేదనేది అపోహ అని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిందని, 2018లో ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల గురించి ప్రస్తావించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మాజీ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ పోరాడారని, అయినా కూడా కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు.
తాజావార్తలు
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!