Congress: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు అక్రమంగా బార్ నడుపుతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress blames Union Minister Smriti Irani: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్మృతి ఇరానీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. స్మృతి ఇరానీ కూతురు.. గోవాలో అక్రమంగా బార్ నడుపతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఇరానీ కుటుంబం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. ఆమె కూతురు గోవాలో రెస్టారెంట్ నడుపుతోందిని.. అందులో అక్రమంగా నకిలీ బార్ లైసెన్స్ తో బార్ ను రన్ చేస్తోందని ఆరోపించారు. స్మృతి ఇరానీ కూతురు మే 2021లో మరణించిన వ్యక్తి పేరు మీద 2022 జూన్ లో లైసెన్స్ తీసుకున్నారని ఆరోపించారు. కానీ లైసెన్స్ ఎవరిపేరుపై ఉందో ఆయన 13 నెలల క్రితమే మరణించారని అన్నారు. ఇది చట్టవిరుద్ధం అని విమర్శించారు. గోవా నిబంధనల ప్రకారం ఒక రెస్టారెంట్ కు ఒక బార్ మాత్రమే పర్మిషన్ ఉంటుందని.. కానీ స్మృతి ఇరానీ కూతురు రెస్టారెంట్ కు రెండు బార్ లైసెన్సులు ఉన్నాయిని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే ఈ బార్ కు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ అధికారిని, ఉన్నతాధికారుల ఒత్తడితో బదిలీ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
Read Also: World Population: 2100 నాటికి చైనా, ఇండియాలో భారీగా తగ్గనున్న జనాభా.. కారణాలు ఏంటంటే..?
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
ఈ విషయంపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తక్షణమే స్మృతి ఇరానీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. గోవాలో బార్ వ్యవహారం స్మృతి ఇరానీకి తెలియకుండా జరుగుతుందా.. అని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ అక్రమాల వెనక ఎవరున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్. అయితే ఈ ఆరోపణలను స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీ తరుపు న్యాయవాది కొట్టిపారేశారు. జోయిష్ ఇరానీకి గోవాలో ఎలాంటి రెస్టారెంట్స్ లేవని.. ఎలాంటి షోకాజ్ నోటీసులు అందలేదని ఆరోపణలను ఖండించారు. స్మృతి ఇరానీ ప్రముఖ రాజకీయనాయకురాలు కావడంతో స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!