Congress: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు అక్రమంగా బార్ నడుపుతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress blames Union Minister Smriti Irani: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్మృతి ఇరానీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. స్మృతి ఇరానీ కూతురు.. గోవాలో అక్రమంగా బార్ నడుపతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఇరానీ కుటుంబం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. ఆమె కూతురు గోవాలో రెస్టారెంట్ నడుపుతోందిని.. అందులో అక్రమంగా నకిలీ బార్ లైసెన్స్ తో బార్ ను రన్ చేస్తోందని ఆరోపించారు. స్మృతి ఇరానీ కూతురు మే 2021లో మరణించిన వ్యక్తి పేరు మీద 2022 జూన్ లో లైసెన్స్ తీసుకున్నారని ఆరోపించారు. కానీ లైసెన్స్ ఎవరిపేరుపై ఉందో ఆయన 13 నెలల క్రితమే మరణించారని అన్నారు. ఇది చట్టవిరుద్ధం అని విమర్శించారు. గోవా నిబంధనల ప్రకారం ఒక రెస్టారెంట్ కు ఒక బార్ మాత్రమే పర్మిషన్ ఉంటుందని.. కానీ స్మృతి ఇరానీ కూతురు రెస్టారెంట్ కు రెండు బార్ లైసెన్సులు ఉన్నాయిని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే ఈ బార్ కు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ అధికారిని, ఉన్నతాధికారుల ఒత్తడితో బదిలీ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
Read Also: World Population: 2100 నాటికి చైనా, ఇండియాలో భారీగా తగ్గనున్న జనాభా.. కారణాలు ఏంటంటే..?
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
ఈ విషయంపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తక్షణమే స్మృతి ఇరానీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. గోవాలో బార్ వ్యవహారం స్మృతి ఇరానీకి తెలియకుండా జరుగుతుందా.. అని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ అక్రమాల వెనక ఎవరున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్. అయితే ఈ ఆరోపణలను స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీ తరుపు న్యాయవాది కొట్టిపారేశారు. జోయిష్ ఇరానీకి గోవాలో ఎలాంటి రెస్టారెంట్స్ లేవని.. ఎలాంటి షోకాజ్ నోటీసులు అందలేదని ఆరోపణలను ఖండించారు. స్మృతి ఇరానీ ప్రముఖ రాజకీయనాయకురాలు కావడంతో స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!