Rajiv Gandhi Assassination Case: దోషుల విడుదలపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Review Petition In Supreme Court On Release Of Rajiv Gandhi Assassination Convicts: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులు ఇటీవల జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే! దోషుల మంచి ప్రవర్తన, వారి విడుదలపై గాంధీ కుటుంబం నుంచి వ్యతిరేకత రాకపోవడంతో పాటు ఇతర అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని.. వారిని విడుదల చేస్తున్నట్టు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త వి.శ్రీహరన్, రవిచంద్రన్, సంథన్, రాబర్ట్ పాయస్, జయకుమార్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు.
దోషుల విడుదలపై గాంధీ కుటుంబంపై ఎలాంటి స్పందన రాలేదు కానీ, కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా స్పందించింది. ప్రధాని హత్యకు పాల్పడ్డ దోషులకు విముక్తి కల్పించడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది. ఇప్పుడు సుప్రీం తీర్పును సవాల్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ.. త్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వారంలోనే పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. అటు.. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సైతం సుప్రీం తీర్పుని వ్యతిరేకించాయి. అంతేకాదు.. తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ, కేంద్ర ప్రభుత్వం గతవారమే రివ్యూ పిటిషన్ సైతం దాఖలు చేసింది.
Also Read
- Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
- Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
- Ratna Debnath: 'నేను నా కూతురిని కోల్పోయా.. ఆమె తన కుర్చీని కోల్పోయింది'.. మమతపై ఆర్జీ కార్ బాధితురాలి తల్లి విమర్శలు
- K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
ఈ కేసులో కోర్టు జారీ చేసిన ఆదేశాలు లోపభూయిష్టమని, దోషులను విడుదల చేయడంపై వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని తన పిటిషన్లో కేంద్రం విజ్ఞప్తి చేసింది. వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండానే దోషులను విడుదల చేయడమనేది.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినట్టు అంగీకరించడమే అవుతుందని, న్యాయాన్ని నీరుగార్చినట్టేనని పేర్కొంది. నేర న్యాయ వ్యవస్థపై తీవ్ర పరిణామాలు చూపే ఈ తరహా వ్యవహారాల్లో.. కేంద్ర ప్రభుత్వ సహాయం చాలా ముఖ్యమని పేర్కొంది.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?