Rajiv Gandhi Assassination Case: దోషుల విడుదలపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Review Petition In Supreme Court On Release Of Rajiv Gandhi Assassination Convicts: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులు ఇటీవల జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే! దోషుల మంచి ప్రవర్తన, వారి విడుదలపై గాంధీ కుటుంబం నుంచి వ్యతిరేకత రాకపోవడంతో పాటు ఇతర అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని.. వారిని విడుదల చేస్తున్నట్టు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త వి.శ్రీహరన్, రవిచంద్రన్, సంథన్, రాబర్ట్ పాయస్, జయకుమార్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు.
దోషుల విడుదలపై గాంధీ కుటుంబంపై ఎలాంటి స్పందన రాలేదు కానీ, కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా స్పందించింది. ప్రధాని హత్యకు పాల్పడ్డ దోషులకు విముక్తి కల్పించడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది. ఇప్పుడు సుప్రీం తీర్పును సవాల్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ.. త్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వారంలోనే పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. అటు.. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సైతం సుప్రీం తీర్పుని వ్యతిరేకించాయి. అంతేకాదు.. తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ, కేంద్ర ప్రభుత్వం గతవారమే రివ్యూ పిటిషన్ సైతం దాఖలు చేసింది.
Also Read
- PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
- Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
ఈ కేసులో కోర్టు జారీ చేసిన ఆదేశాలు లోపభూయిష్టమని, దోషులను విడుదల చేయడంపై వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని తన పిటిషన్లో కేంద్రం విజ్ఞప్తి చేసింది. వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండానే దోషులను విడుదల చేయడమనేది.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినట్టు అంగీకరించడమే అవుతుందని, న్యాయాన్ని నీరుగార్చినట్టేనని పేర్కొంది. నేర న్యాయ వ్యవస్థపై తీవ్ర పరిణామాలు చూపే ఈ తరహా వ్యవహారాల్లో.. కేంద్ర ప్రభుత్వ సహాయం చాలా ముఖ్యమని పేర్కొంది.
తాజావార్తలు
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
-
Kiran Abbavaram: థియేటర్ల నుంచి బయటకొచ్చాక నెలల తరబడి గుర్తుంటుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం ప్రామిస్!
-
CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
-
Vaibhav Sooryavanshi: ‘మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను’.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!