Mallikarjun Kharge: మోడీ కారణంగా నా ర్యాలీ ఆలస్యమైంది.. ఖర్గే ఆరోపణలు
- మోడీ కారణంగా నా ర్యాలీ ఆలస్యమైంది
- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో రెండో విడత పోలింగ్ కోసం ఉధృతంగా ప్రచారం సాగుతోంది. అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులంతా ర్యాలీలు, బహిరంగ సభలతో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఓ వైపు ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు ప్రచారం చేస్తుండగా.. ఇంకోవైపు రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే లాంటి అగ్ర నేతలంతా ప్రచారం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: యువతకు బీజేపీ ల్యాప్టాప్లు ఇస్తుంటే.. ఆర్జేడీ రివాల్వర్లు ఇస్తోంది.. విపక్షంపై మోడీ విమర్శలు
Also Read
- Karnataka: కర్ణాటకపై రాహుల్గాంధీ వ్యూహం ఇదేనా? సిద్ధూకు లక్కీ ఛాన్స్!
- Khawaja Asif: ‘‘మా పూర్వీకులు హిందువులే’’.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..
- Benjamin Netanyahu: ప్రపంచం వ్యతిరేకించినా భారత్ మాత్రం ఇజ్రాయెల్తోనే
- India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ బోర్డర్లో ఉద్రిక్తత.. బీజీబీ ఎందుకు రెచ్చిపోతోంది?
ప్రధాని మోడీ కారణంగా రెండు గంటల పాటు ఎన్నికల ప్రచారానికి అంతరాయం కలిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. శుక్రవారం రోహ్తాస్ జిల్లాలోని చెనారిలో ఖర్గే ఎన్నికల ర్యాలీ ఉంది. అదే సమయంలో ఔరంగాబాద్, కైమూర్ జిల్లాల్లో మోడీ ర్యాలీలు ఉన్నాయి. పొరుగునే రోహ్తాస్ ఉంది. అదే సమయంలో మోడీ విమానం టేకాఫ్ అవుతుండగా.. ఖర్గే హెలికాప్టర్ను రెండు గంటల పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ కారణంగానే తన ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది తలెత్తిందన్నారు.
ఇది కూడా చదవండి: JK Encounter: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
బీజేపీ నాయకులు తమ ర్యాలీలను అడ్డుకుంటున్నారని.. వారి కోసం తమను అడ్డుకుంటున్నారని ఖర్గే ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు ఎల్లప్పుడూ మా ర్యాలీల్లోకి వస్తున్నారని మండిపడ్డారు. ఎక్కువ సమయం విదేశాల్లో గడిపే మోడీ.. ఎన్నికల సమయంలో మాత్రం దేశంలో కనిపిస్తారని విమర్శించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మోడీ ఏ మాత్రం సంకోచించరని ఎద్దేవా చేశారు. మోడీ అబద్ధాలు చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడరని.. అతని స్నేహితుడు అమిత్ షా కూడా అంతేనని వ్యాఖ్యానించారు. పేదలకు కోటి ఇళ్లుల హామీ నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందన్నారు.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడత పోలింగ్ నవంబర్ 6న ముగిసింది. 121 స్థానాల్లో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. 1951 తర్వాత అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఇక రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. మంగళవారం 122 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది.
తాజావార్తలు
-
Hero Flex Fuel Bike: హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ రిలీజ్ కు రెడీ.. పెట్రోల్, ఇథనాల్ రెండింటిపైనా పరుగులు!
-
Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
-
Karnataka: కర్ణాటకపై రాహుల్గాంధీ వ్యూహం ఇదేనా? సిద్ధూకు లక్కీ ఛాన్స్!
-
Hardik Pandya: కీలక నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్య.. MI కి బై బై.. ఆగస్టులో ఆ జట్టులోకి ఎంట్రీ..?
-
Memu Kapulam: ‘మేము కాపులం’ టైటిల్ పబ్లిసిటీ కోసమే.. కానీ అందులో బూతులుండవు: బి.వి.ఎస్.రవి
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!