Congress: కాంగ్రెస్ పార్టీ “టాస్క్ ఫోర్స్” సమావేశం.. 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Party Task Force Meeting on 2024 Elections: 2024 సార్వత్రిక ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ సార్వత్రిక ఎన్నికల కోసం వ్యూహాలను రెడీ చేసుకుంటోంది. అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి పలుమార్లు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా 2024 లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ‘‘టాస్క్ ఫోర్స్’’ సమావేశం కానుంది. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమాయత్తంపై సమీక్షాసమావేశం జరగనుంది.
Read Also: Junk Food Survey: పిల్లలు జంక్ ఫుడ్ తినడానికి కారణం ఇదే.. భారతీయ తల్లిదండ్రుల అభిప్రాయం
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
సోమవారం కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో పార్టీ నేతలు సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఖర్గే తొలిసారిగా టాస్క్ ఫోర్స్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేసేందుకు పార్టీ కార్యచరణ రూపొందించనుంది. కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలకు కేంద్రమైన ‘‘వార్ రూమ్’’లో ఈ సమావేశం జరుగుతోంది. ఏఐసిసి సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కే. వేణుగోపాల్, సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేశ్, రాజీవ్ శుక్లా, సచిన్ పైలట్ సమావేశంలో పాల్గొన్నారు. ఇదే విధంగా రాహుల్ గాంధీ చేపట్టిన ‘ భారత్ జోడో యాత్ర ’పై ప్రజల్లో వస్తున్న స్పందన గురించి కూడా నేతలు చర్చించనున్నారు. భారత్ జోడో యాత్ర మరింత ప్రభావవంతంగా ఉండేందుకు నేతల నుంచి సూచనలు తీసుకోనున్నారు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
తాజావార్తలు
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!