కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్రశంసించారు. ఆయన ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడు.. ప్రజల్లో తన ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు తనను తాను ఎంతో సంస్కరించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ ఈ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నేతల గురించి చర్చ వచ్చింది.. ఎలాంటి నాయకుడిని ఇష్టపడతారు? అని యాంకర్ ప్రశ్నించగా.. దీనికి సైఫ్ బదులిస్తూ.. ‘ధైర్యంగా, నిజాయతీగా ఉండే పొలిటికల్ నాయకులంటే ఇష్టం’ అని చెప్పారు. అప్పుడు వ్యాఖ్యాత కొందరు పేర్లను తెలపగా.. ప్రధాని మోడీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, రాహుల్ గాంధీలో ఎవరిని ఎంచుకుంటారని క్వశ్చన్ చేశారు.
Read Also: Uttarpradesh : రోడ్డుపై కారు పార్కింగ్ చేస్తే ప్రభుత్వం టోలు తీస్తది.. ఎంత వసూలు చేస్తుందంటే ?
ఇక, దీనికి సైఫ్ ఆలీఖాన్ స్పందిస్తూ.. వాళ్లందరూ ధైర్యవంతులైన రాజకీయ నాయకులే.. కానీ, రాహుల్గాంధీ తీరు నన్ను కాస్త ఎక్కువగా ఆకట్టుకుంటోంది అన్నారు. గతంలో ఆయన చేసే పనులను, చెప్పే మాటలను కొంత మంది అగౌరవపర్చారు.. అలాంటి స్థితి నుంచి ఆయన తనను తాను ఎంతగానో మార్చుకున్నారని సైఫ్ వెల్లడించారు. ప్రజల్లో ఆదరణ చూరగొనేందుకు రాహుల్ గాంధీ చాలా కష్టపడ్డారు.. ఆ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
Read Also: China: సముద్రంలో మునిగిపోయిన చైనా కొత్త అణు జలాంతర్గామి.. ఫుల్ ఖుషీ అవుతున్న అమెరికా
తాజాగా ‘దేవర’ సినిమాలో భైర పాత్రలో సైఫ్ ఆలీఖాన్ ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ అడ్డు తొలగించుకొని సముద్రాన్ని శాసించాలనుకొనే పాత్రలో అతడు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఎన్టీఆర్, సైఫ్ల మధ్య ఫైట్ సన్నివేశాలు మరో లెవల్ లో ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.