BJP: అబద్ధాలతో సమాజంలో ఉద్రిక్తతల్ని పెంచుతోంది.. కాంగ్రెస్పై ఈసీకి ఫిర్యాదు..
BJP: రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని, సమాజంలో ఉద్రిక్తతలను సృష్టిస్తోందని బీజేపీ ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజ్యాంగం మార్చేందుకు, రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 స్థానాలు కోరుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఫిర్యాదు నమోదైంది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మరియు పార్టీ నాయకుడు ఓం పాఠక్ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్తో సహా ఇతర ఇండియా కూటమి పార్టీలు డీఫ్ ఫేక్ వీడియోలను అప్లోడ్ చేసి షేర్ చేస్తున్నాయని బీజేపీ ఆరోపించింది.
Also Read
- NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
- Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన నకిలీ వీడియో వైరల్ అయింది. ఇందులో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆయన ప్రకటించినట్లుగా మార్పింగ్ వీడియోను వైరల్ చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ సహా 22 మందికి సమన్లు పంపింది.
వ్యక్తులు, విధానాలు, రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు నిరంతరం అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, సమాజంలో ఉద్రిక్తతలను పెంపొందించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణలో అడ్డంకులు సృష్టించే ప్రయత్నంలో, కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు వ్యవస్థీకృత పద్ధతిలో దీనిని చేస్తున్నాయని బీజేపీ నేత త్రివేది ఆరోపించారు. వీటిపై ఈసీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. బీజేపీ ఈ ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతల ప్రసంగాలను ఈసీకి మెమొరాండంగా ఇచ్చింది.
తాజావార్తలు
-
NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
-
KL Rahul: నా ప్లాన్ రివర్స్ అయింది.. అయినా నాకు సంతోషమే!
-
AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
-
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!