BJP: అబద్ధాలతో సమాజంలో ఉద్రిక్తతల్ని పెంచుతోంది.. కాంగ్రెస్పై ఈసీకి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని, సమాజంలో ఉద్రిక్తతలను సృష్టిస్తోందని బీజేపీ ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజ్యాంగం మార్చేందుకు, రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 స్థానాలు కోరుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఫిర్యాదు నమోదైంది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మరియు పార్టీ నాయకుడు ఓం పాఠక్ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్తో సహా ఇతర ఇండియా కూటమి పార్టీలు డీఫ్ ఫేక్ వీడియోలను అప్లోడ్ చేసి షేర్ చేస్తున్నాయని బీజేపీ ఆరోపించింది.
Also Read
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన నకిలీ వీడియో వైరల్ అయింది. ఇందులో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆయన ప్రకటించినట్లుగా మార్పింగ్ వీడియోను వైరల్ చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ సహా 22 మందికి సమన్లు పంపింది.
వ్యక్తులు, విధానాలు, రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు నిరంతరం అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, సమాజంలో ఉద్రిక్తతలను పెంపొందించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణలో అడ్డంకులు సృష్టించే ప్రయత్నంలో, కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు వ్యవస్థీకృత పద్ధతిలో దీనిని చేస్తున్నాయని బీజేపీ నేత త్రివేది ఆరోపించారు. వీటిపై ఈసీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. బీజేపీ ఈ ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతల ప్రసంగాలను ఈసీకి మెమొరాండంగా ఇచ్చింది.
తాజావార్తలు
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
-
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!