BJP: అబద్ధాలతో సమాజంలో ఉద్రిక్తతల్ని పెంచుతోంది.. కాంగ్రెస్పై ఈసీకి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని, సమాజంలో ఉద్రిక్తతలను సృష్టిస్తోందని బీజేపీ ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజ్యాంగం మార్చేందుకు, రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 స్థానాలు కోరుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఫిర్యాదు నమోదైంది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మరియు పార్టీ నాయకుడు ఓం పాఠక్ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్తో సహా ఇతర ఇండియా కూటమి పార్టీలు డీఫ్ ఫేక్ వీడియోలను అప్లోడ్ చేసి షేర్ చేస్తున్నాయని బీజేపీ ఆరోపించింది.
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన నకిలీ వీడియో వైరల్ అయింది. ఇందులో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆయన ప్రకటించినట్లుగా మార్పింగ్ వీడియోను వైరల్ చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ సహా 22 మందికి సమన్లు పంపింది.
వ్యక్తులు, విధానాలు, రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు నిరంతరం అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, సమాజంలో ఉద్రిక్తతలను పెంపొందించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణలో అడ్డంకులు సృష్టించే ప్రయత్నంలో, కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు వ్యవస్థీకృత పద్ధతిలో దీనిని చేస్తున్నాయని బీజేపీ నేత త్రివేది ఆరోపించారు. వీటిపై ఈసీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. బీజేపీ ఈ ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతల ప్రసంగాలను ఈసీకి మెమొరాండంగా ఇచ్చింది.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!