Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. రాహుల్ గాంధీ కాశ్మీర్ టూ కన్యాకుమారి యాత్ర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ తనను తాను సంస్కరించుకోవాలని చూస్తోంది. దీనికి రాజస్తాన్ ఉదయ్ పూర్ లో జరుగుతున్న ‘ నవ కల్పన్ శింతన్ శిబిర్’ వేదిక కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ‘ ఒక కుటుంబం- ఒక సీటు’ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ తనపై ఉన్న కుటుంబ పార్టీ ముద్రను తొలగించుకోవాలని అనుకుంటోంది. దీంతో పాటు పార్టీలో పనిచేసే వారికి మాత్రమే పదవులు, టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై లీడర్లు తమ బంధువులకు టికెట్ ఇప్పించే విధానానికి స్వస్తి పలుకుతోంది కాంగ్రెస్.
ఇదిలా ఉంటే మూడు రోజుల చింతన్ శిబిర్ నేటితో ముగియబోతోంది. కీలకమైన 6 అంశాలపై కాంగ్రెస్ తీర్మానాలు ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. దీనికోసం ఆదివారం ఉదయం 11 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ కాబోతోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతు, యువత, సంస్థాగత అంశాలపై ప్రవేశపెట్టే తీర్మాణాలకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలుపనుంది. ఈ అంశాలపై ఏ తీర్మానాలు చేస్తారనే విషయంపై కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కాశ్మీర్ టూ కన్యాకుమారి యాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ ప్రజా సమస్యలను తెలుసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ శాతం పాదయాత్రలే ఉంటాయని తెలుస్తోంది. అయితే దీనిపై ప్రస్తుతానికి కాంగ్రెస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతోంది. వచ్చే ఏడాది ఈ యాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించానే వాదనలు ఎక్కువ అవుతున్నాయి. పార్టీలోని అనేక మంది నాయకులు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు అధ్యక్షరాలుగా ఉన్న సోనియా గాంధీ కూడా రాహుల్ గాంధీకి పార్టీని అప్పచెప్పాలని నాయకులు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!