PM Modi: సామాన్య ప్రజల కలలు నెరవేరుతున్నాయి.. ప్రతిపక్షాలు ఆగ్రహిస్తున్నాయి: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దేశంలోని సామాన్య ప్రజల కలలు నెరవేరుతుండటంతో ప్రతిపక్షాలు ఆగ్రహిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. గుజరాత్లోని రాజ్కోట్లో అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని.. అలా చేసి ఉండకపోతే నిత్యావసర ధరలు మరింతగా పెరిగేవన్నారు. ప్రజలను దాహంతో ఉంచినవారు, వారి ఆకాంక్షలు, ఆశలను పట్టించుకోని వారు నేడు ప్రజల కలలు సాకారమవుతుంటే చూసి ఆగ్రహిస్తున్నారంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. అవినీతి, వారసత్వంతో కూడినవారని విపక్షాల కూటమిని విమర్శించారు.
Read also: Sandra Bullock: హీరోయిన్ బర్త్ డే.. న్యూడ్ వీడియో పంపి విష్ చేసిన హీరో
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
విపక్షాల కూటమి పేరు మార్చుకుందే తప్ప.. ఆ ముఖాలు పాతవేననన్నారు. ఆ గ్రూపు పద్ధతులు, ఉద్దేశాలు ఒకేలా ఉంటాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేను అధికారంలోకి రానీయకుండా నిలువరించేందుకు 26 విపక్ష పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన INDIA కూటమిని ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన హామీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే.. వాటినే ఈ తొమ్మిదేళ్లలో అమలు చేసిందన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం కొనసాగితే ప్రజలు నెలకు మొబైల్ ఫోన్ బిల్లు రూ.6000 చొప్పున చెల్లించాల్సి వచ్చేదన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్, క్వాలిటీ ఆఫ్ లైవ్ తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటన్న ప్రధాని.. డిజిటల్ ఇండియాతో సామాన్యుల సమస్యల్నింటినీ పరిష్కరించామన్నారు. కొన్నేళ్లుగా రాజ్కోట్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇప్పుడు సౌరాష్ట్రకు గ్రోత్ ఇంజిన్గా గుర్తింపు సాధించిందని ప్రధాని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతి విషయంలోనూ రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారని విమర్శించారు. ప్రతిదీ రాజకీయం చేయడం మంచిది కాదని విపక్షాలకు ప్రధాని హితవు పలికారు.
తాజావార్తలు
-
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!