CM Yogi Adityanath: ఆర్ఎస్ఎస్ చీఫ్ని కలవనున్న సీఎం యోగి.. ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామం..
- ఆర్ఎస్ఎస్ చీఫ్తో భేటీ కానున్న యూపీ సీఎం..
- ఎన్నికల తర్వాత కీలక పరిణామం..
- ఆర్ఎస్ఎస్ విమర్శల నేపథ్యంలో కీలకంగా సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi Adityanath: లోక్సభ ఎన్నికల ఫలితాలు , ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ని కలవనున్నట్లు తెలుస్తోంది. గురువారం గోరఖ్పూర్లో జరిగిన కార్యకర్త శిబిరానికి భగవత్ హాజరయ్యారు. బుధవారం నుంచి 5 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు సీఎం యోగి, మోహన్ భగవత్తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
బీజేపీపై ఆర్ఎస్ఎస్ బయటికి చెప్పకున్నా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరసగా ఆర్ఎస్ఎస్ నేతలు బీజేపీ అహంకారంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. మణిపూర్ సమస్యపై సోమవారం మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా అక్కడ శాంతి నెలకొనలేదని కేంద్రాన్ని పరోక్షంగా విమర్శించారు. ప్రజాసేవలో వినయంగా వ్యవహరించాలని అన్నారు. ఇదిలా ఉంటే మరోనేత ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. అహంకారులుగా వ్యవహరించిన వారిని 241 వద్దే శ్రీరాముడు అడ్డుకున్నాడని అన్నారు.
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
Read Also: Sehwag-Shakib: సెహ్వాగ్ ఎవరో నాకు తెలియదు.. షకీబ్ అల్ హసన్ కౌంటర్!
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో బీజేపీకి మద్దతు తెలపలేదని తెలుస్తోంది. సైద్ధాంతిక సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్ని బీజేపీ పట్టించుకోకపోవడంతోనే ఇది జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్లో దారుణ పరాజయానికి ఇది ఓ కారణంగా చెబుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 36 సీట్లను సాధించింది. బీజేపీ 33 సీట్లకు పరిమితమైంది. సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)- కాంగ్రెస్ ఇండియా కూటమి 43 స్థానాలను గెలుచుకుంది. అయోధ్య రామాలయాన్ని నిర్మించిన ఫైజాబాద్ ఎంపీ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది.
ఉత్తర్ ప్రదేశ్ ఫలితాలు బీజేపీని మెజారిటీ మార్కుకు దూరం చేశాయి. గత రెండు పర్యాయాలు 2014, 2019లో బీజేపీ యూపీలో 60+కి పైగా సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ మెజారిటీ మార్క్(272)ని దాటింది. ఈసారి మాత్రం బీజేపీ 240 సీట్ల వద్దే ఆగిపోయింది. అయితే, ఎన్డీయే కూటమి మొత్తంగా 293 స్థానాలు సాధించింది. అధికారం కోసం టీడీపీ, జేడీయూ, శివసేనలపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్తో సీఎం యోగి భేటీ కాబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజావార్తలు
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?