Sethusamudram Project: సేతుసముద్రం ప్రాజెక్ట్ పై తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.. బీజేపీ మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sethusamudram Project: సేతుసముద్రం ప్రాజెక్టుపై గురువారం తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. బీజేపీతో పాటు అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతుగా నిలిచాయి. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరాలను కలిపేందుకు ఈ సేతు సముద్రం ప్రాజెక్టు కీలకంగా మారుతుంది. ఈ ప్రాజెక్టును కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. గతంలో సేతు సముద్రం ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ కూడా దీనికి సపోర్టు చేసింది. అయితే రామసేతు నిర్మాణానికి ఎలాంటి హాని కలుగకుండా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని బీజేపీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ అన్నారు. ఈ ప్రాజెక్టు వాస్తవ రూపం దాలిస్తే దక్షిణతమిళనాడులో మాకన్నా ఎక్కువ సంతోషించే వారు ఎవరూ లేరని చెప్పారు.
శ్రీలంక చుట్టూ తిరిగి రాకుండా సేతుసముద్రం ప్రాజెక్టు పూర్తయితే తూర్పు, పశ్చిమ తీరాలను నేరుగా కలపవచ్చు. ఈ ప్రాజెక్టు ఆలస్యం అయినా కొద్ది తమిళనాడు అభివృద్ధికి అవరోధం ఏర్పడుతుందని తీర్మానంలో పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రిటీష్ వారి హయాంలో 1860లో సేతుసముద్రం ప్రాజెక్టు బీజం పడింది. భారత్, శ్రీలంకల మధ్య ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతు ఉందని హిందువులు నమ్ముతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా మతపరమైన ఉద్రిక్తత ఏర్పడుతోంది. రామాయణ కాలంలో రాముడు భారతదేశం, లంకల మధ్య ఈ వంతెనను ఏర్పాటు చేసినట్లు హిందువులు భావిస్తుంటారు.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Maalika Puram: అల్లు అరవింద్ చేతికి మరో సూపర్ హిట్ మూవీ రైట్స్!
ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి అక్కడ సముద్రమార్గాన్ని మరింత లోతుగా తవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల రామసేతు దెబ్బతింటుందనే భావన ఉంది. డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై, దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలని కోరుకున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి పచ్చజెండా ఊపారు. రూ.2400 కోట్ల తో మన్మోహన్ సింగ్ సర్కార్ ప్రారంభం అయింది. అయితే 2007లో మతపరమైన కారణాలు, హిందు వర్గాల నుంచి వ్యతిరేకత, కొంతమంది పర్యావరణవేత్తలు ఈ ప్రాజెక్టుకు బ్రేకులు వేశాయి.
ఇటీవల రామసేతుపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. గతంలో బీజేపీ ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిందని.. అప్పటి సీఎం జయలలిత ఆ ప్రాజెక్టుకు మద్దతిచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తమిళనాడు అభివృద్ధి చెంది ఉండేదని, 50,000 మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని సీఎం స్టాలిన్ అన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!