Site icon NTV Telugu

CM MK Stalin: ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్‌ లేఖ..

Cm Mk Stalin

Cm Mk Stalin

CM MK Stalin: సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థుల విన్నపాలను పరిగణనలోకి తీసుకొని, వాళ్లకు మరో అవకాశమివ్వాలని ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ రాశారు. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారని, చివరి అవకాశాన్నీ కోల్పోయిన వారున్నారని అన్నారు. అలాంటి వాళ్ల అభ్యర్థనను స్వీకరించి వయోపరిమితిని పెంచుతూ మరో సారి పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరారు. చివరి అవకాశం కోల్పోయిన అభ్యర్థులందరికీ మరోసారి పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలంటూ..పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సిఫార్సు చేసిందన్న విషయాన్ని స్టాలిన్‌ తన లేఖలో ప్రస్తావించారు. సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థుల విన్నపాన్ని మరోసారి మీ దృష్టికి తెచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నాను. కరోనా కారణంగా చాలా మంది సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థులు తమ చివరి అవకాశాన్ని కోల్పోయారు. అందువల్ల వారందరికీ వయోపరిమితిని పెంచుతూ మరో అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు సీఎం స్టాలిన్‌.

Read Also: Vijayawada Traffic Restrictions: గుణదల మేరిమాత ఉత్సవాలు.. బెజవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

ఇటీవల ఎస్‌ఎస్‌సీ నిర్వహించిన కేంద్ర సాయుధ బలగాల పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో అన్ని సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు మూడేళ్లపాటు వయోపరిమితిని పెంచిన విషయాన్ని గుర్తు చేశారు స్టాలిన్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రెగ్యులేషన్స్, 1955లోని రెగ్యులేషన్ 4ను అమలు చేయడం ద్వారా కోవిడ్-19 మహమ్మారి కారణంగా తమ చివరి ప్రయత్నాలను ముగించిన అభ్యర్థులకు సంబంధిత వయస్సు సడలింపుకు సంబంధించిన డిమాండ్. ఇది ఒక్కసారి సడలింపు మరియు ఇది ఖజానాపై ఎటువంటి ద్రవ్య భారాన్ని కలిగించదు, అయితే అదే సమయంలో సివిల్ సర్వీస్‌లో చేరాలని ఆకాంక్షించే వేలాది మంది యువతకు భారీ అవకాశాన్ని కల్పిస్తుందన్నారు స్టాలిన్. సివిల్ సర్వీస్ ఔత్సాహికుల డిమాండ్‌ను సానుభూతితో పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా సిఫారసు చేసిందని ముఖ్యమంత్రి తన లేఖలో ఎత్తి చూపారు. వివిధ పార్టీలకు చెందిన 150 మందికి పైగా పార్లమెంటు సభ్యులు ఆశావహుల కారణానికి మద్దతు ఇచ్చారు అని ఆయన చెప్పారు.

Exit mobile version