CM Himanta Biswa Sarma: భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మదర్సాలను కూల్చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Himanta Biswa Sarma.. Bulldozer Action In Assam: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. మదర్సాలు కేంద్రంగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అస్సాం పోలీసులు గుర్తించి.. వరసగా అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నదీకి అటూఇటూగా బంగ్లాదేశ్ ను అనుకుని ఉన్న జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి అక్రమంగా చొరబడి పలు మదర్సాల్లో ఉగ్రశిక్షణ ఇస్తున్నారు. అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్రవాదులను ప్రణాళికలను భగ్నం చేశారు అస్సాం పోలీసులు. కొన్ని అక్రమ మదర్సాలు నిర్వహణపై ప్రభుత్వ కొరడా ఝుళిపించింది. మదర్సాలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఆదేశించింది.
Read Also: MLA Raja Singh: రేపటితో ముగియనున్న బీజేపీ డెడ్లైన్.. గడువు కోరిన రాజాసింగ్ భార్య
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ఇదిలా ఉంటే భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే మదర్సాలను కూల్చివేస్తామని.. సీఎం హిమంత బిశ్వ శర్మ స్ట్రాంగ్ హెచ్చరిక జారీ చేశారు. బుధవారం బొంగైగావ్ జిల్లాలో ‘జీహాదీ’ కార్యక్రమాలకు ఉపయోగించిన మదర్సా భవనాన్ని అధికారులు కూల్చివేసిన తర్వాత ఈ ప్రకటన చేశారు. మదర్సాలను కూల్చివేసే ఉద్దేశ్యం మాకు లేదని.. అయితే జీహాదీలు ఉపయోగించుకుండా చూడాలనే ఉద్దేశ్యం మాత్రమే ఉందని బిశ్వ శర్మ అన్నారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం వస్తే.. మేము వాటిని తప్పకుండా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
అంతకుముందు బంగ్లాదేశ్ వ్యక్తులకు నాలుగేళ్లుగా ఆశ్రయం కల్పించిన బార్ పేట జిల్లాలోని మదర్సాను సోమవారం అధికారులు కూల్చివేశారు. మంగళవారం రాత్రి గోల్ పరా పోలీసులు జరిపిన ఆపరేషన్ లో జీహాదీ అంశాలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సంబంధం ఉన్న మదర్సా టీచర్లు, ఇతర వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత ఉపఖండంలో అల్ ఖైదాకు సంబంధించి ఐదు మాడ్యుళ్లను అస్సాం పోలీసులు ఛేదించారు. బంగ్లాదేశీయులతో సహా జీహాదీ సంబంధాాలు ఉణ్న అనుమానిత వ్యక్తులను 40 మందికి పైగా మందిని మార్చి నుంచి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!