Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రధానమంత్రి నరేంద్రమోడీపై సెటైర్లు వేశారు. విద్యార్థలుతో సోషల్ మీడియా ద్వారా మోడీ చేస్తు్న్న సంభాషణలను ప్రస్తావిస్తూ.. ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇన్ఫ్లూయెన్సర్గా మారాలని ఎద్దేవా చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత మహారాష్ట్రలోని తన సొంతూరుకు తిరిగి వచ్చారు.
ప్రధాని మోడీ ఇన్ఫ్లూయెన్సర్గా బాగా పనిచేస్తున్నారు, కాబట్టి దేశ ప్రధాని పదవిని వదిలి, దేశ పాలనను మరొకరికి అప్పగించాలని అని వ్యాఖ్యానించారు. సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు ముగిసినప్పటికీ, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆందోళనల్లో పాల్గొన్న వారిని వేధిస్తున్నారని దీప్కే ఆరోపించారు. విద్యార్థులను వేధించడం వెంటనే ఆపాలని, ఇదే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన ప్రజల్లో ఉన్న అసంతృప్తి తగ్గలేదని చెప్పారు. ప్రజల ఆగ్రహం వ్యక్తిపై కాదని, ప్రభుత్వ విధానాలపై అని అన్నారు. విద్యార్థుల్ని ఇలాగే టార్గెట్ చేస్తే మరో భారీ ఉద్యమం చేపడుతామని వార్నింగ్ ఇచ్చారు.
జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో విద్యార్థులపై పెల్లెగ్ గన్ ఉపయోగించడానికి ఆదేశాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని దీప్కే డిమాండ్ చేశారు. ఆదేశాలు ఇచ్చిన వారు ఎవరైనా చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పార్ట్ టైమ్ రాజకీయ నాయకురాలు అని అభివర్ణించారు. తాను సీరియస్ రాజకీయ నాయకుల వ్యాఖ్యలపై మాత్రమే స్పందిస్తానని అన్నారు.

