Operation Sindoor: చైనా ప్రొడక్ట్స్ నమ్మెద్దు బ్రో.. భారత్ క్షిపణుల్ని గుర్తించని చైనీస్ రాడార్లు..
- పాకిస్తాన్ని కాపాడని చైనీస్ రక్షణ వ్యవస్థ..
- మిస్సైల్స్ దూసుకువస్తున్న గుర్తించని చైనా రాడార్లు..
- ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ రక్షణ వ్యవస్థ ఫెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇన్నాళ్లు తాము పెంచుకుంటున్న ఉగ్రవాదులను భారత్ బహిర్గతం చేసింది. ఉగ్రస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలను సేకరించి మీర దెబ్బ కొట్టింది. పీఓకేతో పాటు పాక్ ప్రధాన భూభాగాల్లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహీద్దిన్కి చెందిన 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.
అయితే, ఇప్పుడు అందరిలో వస్తున్న ప్రశ్న ఏంటంటే.. భారత్ క్షిపణులతో దాడులు చేస్తుంటే పాకిస్తాన్లో ఉన్న రాడార్లు ఎందుకు గుర్తించలేదు. దీనికి కారణం అవి చైనాకు చెందిన రాడార్లు కావడమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. చైనీస్ వైమానిక రక్షణ వ్యవస్థ ఈ క్షిపణుల్ని అడ్డుకోలేకపోయింది. బుధవారం తెల్లవారుజామున భారత్ ప్రయోగించిన క్షిపణులు ఒక్కొక్క ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసుకుంటు వెళ్తుంటే పాక్ సైన్యం చూడటం తప్ప ఏం చేయలేకపోయింది.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
Read Also: Indian Military Trains: భారతీయ ‘సైనిక రైళ్ల’పై పాకిస్థాన్ నిఘా?
భారత్ రాఫెల్ ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన స్కాల్ప్, హామర్ మిస్సైళ్లు పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ గుర్తించలేదు. పాకిస్తాన్ గగనతలాన్ని HQ-9, LY-80 (HQ-16) డిఫెన్స్ సిస్టమ్స్ కాపాడుతున్నాయని భావిస్తున్నారు. రష్యా S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి HQ-9 కాపీగా భావిస్తారు. గాలిలో శత్రు క్షిపణుల్ని గుర్తించి, వాటిని అడ్డుకునే సామర్థ్యం ఉందని పాకిస్తాన్ తరుచుగా చెబుతుంది. ఆపరేషన్ సిందూర్లో మాత్రం ఈ వ్యవస్థ ఒక్క క్షిపణిని కూడా గుర్తించలేకపోయింది.
భారతదేశం అధునాతన ఎలక్ట్రానికి వార్ ఫేర్ పద్ధతులు- డెకాయిస్, సిగ్నల్ సప్రెషన్, రాడార్ జామింగ్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ నిష్ప్రభావంగా మారింది. బహవల్పూర్, మురిడ్నే, ముజఫరాబాద్లో పాకిస్తాన్ అత్యంత విలువైన ఉగ్ర ఆస్తులపై భారత్ దర్జాగా దాడులు చేస్తుంటే, పాక్ రక్షణ వ్యవస్థ అంతా మూగబోయింది.
చైనీస్ రాడార్లు ఇప్పుడే కాదు పలు సందర్భాల్లో క్షిపణులు, శత్రు విమానాలను గుర్తించడంలో విఫలమయ్యాయి. 2011లో యూఎస్ నేవీ సీల్స్ అబోటాబాద్లో అల్ఖైదా అధినేత ఒసామా బిన్లాడెన్ని మట్టుపెట్టిన సమయంలో, 2019లో భారత్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు, 2022లో భారత బ్రహ్మోస్ మిస్సైల్ మిస్ ఫైరయి పాకిస్తాన్ లోకి వెళ్లినప్పుడు చైనా రక్షణ వ్యవస్థలు విఫలయమ్యాయి. దూసుకువస్తున్న స్కాల్ప్ క్షిపణిని ట్రాక్ చేయడంలో HQ-9 వ్యవస్థ దారుణంగా విఫలమైంది. చైనా అంటే చీప్ ప్రోడక్ట్ అని మరోసారి తేటతెల్లమైంది.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..