Operation Sindoor: చైనా ప్రొడక్ట్స్ నమ్మెద్దు బ్రో.. భారత్ క్షిపణుల్ని గుర్తించని చైనీస్ రాడార్లు..
- పాకిస్తాన్ని కాపాడని చైనీస్ రక్షణ వ్యవస్థ..
- మిస్సైల్స్ దూసుకువస్తున్న గుర్తించని చైనా రాడార్లు..
- ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ రక్షణ వ్యవస్థ ఫెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇన్నాళ్లు తాము పెంచుకుంటున్న ఉగ్రవాదులను భారత్ బహిర్గతం చేసింది. ఉగ్రస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలను సేకరించి మీర దెబ్బ కొట్టింది. పీఓకేతో పాటు పాక్ ప్రధాన భూభాగాల్లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహీద్దిన్కి చెందిన 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.
అయితే, ఇప్పుడు అందరిలో వస్తున్న ప్రశ్న ఏంటంటే.. భారత్ క్షిపణులతో దాడులు చేస్తుంటే పాకిస్తాన్లో ఉన్న రాడార్లు ఎందుకు గుర్తించలేదు. దీనికి కారణం అవి చైనాకు చెందిన రాడార్లు కావడమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. చైనీస్ వైమానిక రక్షణ వ్యవస్థ ఈ క్షిపణుల్ని అడ్డుకోలేకపోయింది. బుధవారం తెల్లవారుజామున భారత్ ప్రయోగించిన క్షిపణులు ఒక్కొక్క ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసుకుంటు వెళ్తుంటే పాక్ సైన్యం చూడటం తప్ప ఏం చేయలేకపోయింది.
Also Read
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
Read Also: Indian Military Trains: భారతీయ ‘సైనిక రైళ్ల’పై పాకిస్థాన్ నిఘా?
భారత్ రాఫెల్ ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన స్కాల్ప్, హామర్ మిస్సైళ్లు పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ గుర్తించలేదు. పాకిస్తాన్ గగనతలాన్ని HQ-9, LY-80 (HQ-16) డిఫెన్స్ సిస్టమ్స్ కాపాడుతున్నాయని భావిస్తున్నారు. రష్యా S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి HQ-9 కాపీగా భావిస్తారు. గాలిలో శత్రు క్షిపణుల్ని గుర్తించి, వాటిని అడ్డుకునే సామర్థ్యం ఉందని పాకిస్తాన్ తరుచుగా చెబుతుంది. ఆపరేషన్ సిందూర్లో మాత్రం ఈ వ్యవస్థ ఒక్క క్షిపణిని కూడా గుర్తించలేకపోయింది.
భారతదేశం అధునాతన ఎలక్ట్రానికి వార్ ఫేర్ పద్ధతులు- డెకాయిస్, సిగ్నల్ సప్రెషన్, రాడార్ జామింగ్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ నిష్ప్రభావంగా మారింది. బహవల్పూర్, మురిడ్నే, ముజఫరాబాద్లో పాకిస్తాన్ అత్యంత విలువైన ఉగ్ర ఆస్తులపై భారత్ దర్జాగా దాడులు చేస్తుంటే, పాక్ రక్షణ వ్యవస్థ అంతా మూగబోయింది.
చైనీస్ రాడార్లు ఇప్పుడే కాదు పలు సందర్భాల్లో క్షిపణులు, శత్రు విమానాలను గుర్తించడంలో విఫలమయ్యాయి. 2011లో యూఎస్ నేవీ సీల్స్ అబోటాబాద్లో అల్ఖైదా అధినేత ఒసామా బిన్లాడెన్ని మట్టుపెట్టిన సమయంలో, 2019లో భారత్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు, 2022లో భారత బ్రహ్మోస్ మిస్సైల్ మిస్ ఫైరయి పాకిస్తాన్ లోకి వెళ్లినప్పుడు చైనా రక్షణ వ్యవస్థలు విఫలయమ్యాయి. దూసుకువస్తున్న స్కాల్ప్ క్షిపణిని ట్రాక్ చేయడంలో HQ-9 వ్యవస్థ దారుణంగా విఫలమైంది. చైనా అంటే చీప్ ప్రోడక్ట్ అని మరోసారి తేటతెల్లమైంది.
తాజావార్తలు
-
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!