Operation Sindoor: చైనా ప్రొడక్ట్స్ నమ్మెద్దు బ్రో.. భారత్ క్షిపణుల్ని గుర్తించని చైనీస్ రాడార్లు..
- పాకిస్తాన్ని కాపాడని చైనీస్ రక్షణ వ్యవస్థ..
- మిస్సైల్స్ దూసుకువస్తున్న గుర్తించని చైనా రాడార్లు..
- ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ రక్షణ వ్యవస్థ ఫెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇన్నాళ్లు తాము పెంచుకుంటున్న ఉగ్రవాదులను భారత్ బహిర్గతం చేసింది. ఉగ్రస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలను సేకరించి మీర దెబ్బ కొట్టింది. పీఓకేతో పాటు పాక్ ప్రధాన భూభాగాల్లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహీద్దిన్కి చెందిన 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.
అయితే, ఇప్పుడు అందరిలో వస్తున్న ప్రశ్న ఏంటంటే.. భారత్ క్షిపణులతో దాడులు చేస్తుంటే పాకిస్తాన్లో ఉన్న రాడార్లు ఎందుకు గుర్తించలేదు. దీనికి కారణం అవి చైనాకు చెందిన రాడార్లు కావడమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. చైనీస్ వైమానిక రక్షణ వ్యవస్థ ఈ క్షిపణుల్ని అడ్డుకోలేకపోయింది. బుధవారం తెల్లవారుజామున భారత్ ప్రయోగించిన క్షిపణులు ఒక్కొక్క ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసుకుంటు వెళ్తుంటే పాక్ సైన్యం చూడటం తప్ప ఏం చేయలేకపోయింది.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
Read Also: Indian Military Trains: భారతీయ ‘సైనిక రైళ్ల’పై పాకిస్థాన్ నిఘా?
భారత్ రాఫెల్ ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన స్కాల్ప్, హామర్ మిస్సైళ్లు పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ గుర్తించలేదు. పాకిస్తాన్ గగనతలాన్ని HQ-9, LY-80 (HQ-16) డిఫెన్స్ సిస్టమ్స్ కాపాడుతున్నాయని భావిస్తున్నారు. రష్యా S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి HQ-9 కాపీగా భావిస్తారు. గాలిలో శత్రు క్షిపణుల్ని గుర్తించి, వాటిని అడ్డుకునే సామర్థ్యం ఉందని పాకిస్తాన్ తరుచుగా చెబుతుంది. ఆపరేషన్ సిందూర్లో మాత్రం ఈ వ్యవస్థ ఒక్క క్షిపణిని కూడా గుర్తించలేకపోయింది.
భారతదేశం అధునాతన ఎలక్ట్రానికి వార్ ఫేర్ పద్ధతులు- డెకాయిస్, సిగ్నల్ సప్రెషన్, రాడార్ జామింగ్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ నిష్ప్రభావంగా మారింది. బహవల్పూర్, మురిడ్నే, ముజఫరాబాద్లో పాకిస్తాన్ అత్యంత విలువైన ఉగ్ర ఆస్తులపై భారత్ దర్జాగా దాడులు చేస్తుంటే, పాక్ రక్షణ వ్యవస్థ అంతా మూగబోయింది.
చైనీస్ రాడార్లు ఇప్పుడే కాదు పలు సందర్భాల్లో క్షిపణులు, శత్రు విమానాలను గుర్తించడంలో విఫలమయ్యాయి. 2011లో యూఎస్ నేవీ సీల్స్ అబోటాబాద్లో అల్ఖైదా అధినేత ఒసామా బిన్లాడెన్ని మట్టుపెట్టిన సమయంలో, 2019లో భారత్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు, 2022లో భారత బ్రహ్మోస్ మిస్సైల్ మిస్ ఫైరయి పాకిస్తాన్ లోకి వెళ్లినప్పుడు చైనా రక్షణ వ్యవస్థలు విఫలయమ్యాయి. దూసుకువస్తున్న స్కాల్ప్ క్షిపణిని ట్రాక్ చేయడంలో HQ-9 వ్యవస్థ దారుణంగా విఫలమైంది. చైనా అంటే చీప్ ప్రోడక్ట్ అని మరోసారి తేటతెల్లమైంది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!