China: చైనా రెచ్చగొట్టే చర్య.. వాస్తవాధీన రేఖ వద్దకు యుద్ధ విమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: సరిహద్దుల్లో కొద్ది రోజల వరకు కిమ్మనకుండా ఉన్న చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దు నిబంధనలను అతిక్రమించింది. కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల తర్వాత కూడా, చైనా యుద్ధ విమానాలు తూర్పు లద్ధాఖ్లో మోహరించి భారత బలగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. గత మూడు నాలుగు వారాల్లో వాస్తవాధీన రేఖకు దగ్గరగా డ్రాగన్కు చెందిన విమానాలు ఎగురుతూనే ఉన్నాయి. ఇలా విమానాలు ఎగరడం ఆ ప్రాంతంలోని భారత రక్షణ యంత్రాంగాన్ని పరిశోధించే చర్యగా పరిగణించవచ్చు. భారత వైమానిక దళం పరిస్థితులకు తగ్గట్లుగా ప్రతిస్పందిస్తోంది. జే-11తో సహా చైనా యుద్ధ విమానాలు వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరగా ఎగురుతూనే ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో 10 కిమీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ రేఖను ఉల్లంఘించిన సందర్భాలు ఉన్నాయని తెలిపాయి.
Monkeypox Cases: ఒకే వ్యక్తిలో మంకీపాక్స్, కరోనా.. అధికారుల హైఅలర్ట్
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ఈ రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందనగా భారత వైమానిక దళం గట్టి చర్యలు చేపట్టింది. మిగ్-29,మిరాజ్ 2000తో సహా అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలను స్థావరాలకు తరలించింది. చైనా చర్యలకు నిమిషాల్లోనే సమాధానం చెప్పొచ్చని అధికారిక వర్గాలు ప్రకటించాయి. డ్రాగన్ ముప్పును అధిగమించడానికి భారత వైమానిక దళం ఫైటర్ జెట్లను సిద్ధం చేసింది. చైనీస్ విమానాలను భారత దళాలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి. జూన్ చివరి వారంలో చైనా యుద్ధ విమానం ఎల్ఏసీ ప్రాంతంలో కొన్ని నిమిషాల పాటు తిరిగింది. దీంతో భారత రాడార్లు గుర్తించి అలెర్ట్ చేశాయి. వెంటనే భారత ఫైటర్ జెట్స్ రంగంలోకి దిగడంతో చైనా యుద్ధ విమానం తోక ముడిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. చైనా యుద్ధ విమానాలను సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)కి దగ్గరగా గుర్తించిన వెంటనే తాము చాలా వేగంగా స్పందిస్తామని, ఫైటర్ విమానాలతోపాటు అన్ని వ్యవస్థలను హై అలెర్ట్ చేస్తామని భారత వాయుసేన (ఐఏఎఫ్) చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!