Operation Sindoor: ‘‘రాఫెల్ జెట్స్’’ కూలాయని చైనా తప్పుడు ప్రచారం: యూఎస్ రిపోర్ట్..
- రాఫెల్ కూలినట్లు చైనా తప్పుడు ప్రచారం..
- యూఎస్ నివేదికలో సంచలన విషయాలు..
Operation Sindoor: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది టూరిస్టుల్ని అన్యాయంగా చంపేశారు. దీనికి ప్రతిగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ప్రధాన కార్యాలయాలపై భీకరదాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదే సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత సైనిక స్థావరాలపై, ప్రజలపై దాడులకు యత్నించడంతో భారత్ పాకిస్తాన్ వైమానికి దళానికి చెందిన ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది.
Read Also: Mini Projector Tips: మినీ ప్రొజెక్టర్ కొంటున్నారా?.. ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే!
Also Read
- One Vote Victory: ఒక్క ఓటుతో గెలుపు.. తిరుపత్తూరులో టీవీకే అభ్యర్థి సంచలన విజయం!
- Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్లో ఘోర పరాజయం
- Sunetra Pawar: బారామతి చరిత్రలో సరికొత్త అధ్యాయం.. భర్త మెజార్టీని క్రాస్ చేసిన సునేత్రా పవార్!
అయితే, నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సంఘర్షణలో భారత్కు చెందిన రాఫెల్ ఫైటర్ జెట్లు కూలిపోయాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదంతా చైనా చేసిన తప్పుడు ప్రచారమని యూఎస్ నివేదిక ఒకటి వెల్లడించింది. చైనా తన సొంత తయారీ ఫైటర్ జెట్ J-35లకు అనుకూలంగా ఫ్రెంచ్ రాఫెట్ జెట్ అమ్మకాలను అడ్డుకోవడానికి తప్పుడు సమచారాన్ని ప్రారంభించిందని అమెరికా రిపోర్ట్ వెల్లడించింది. రాఫెట్ ఫైటర్ జెట్ గొప్పతనాన్ని దెబ్బతీసేందుకు చైనా రహస్య ప్రచారాన్ని నిర్వహించిందని ఫ్రెంచ్ నిఘా, సైనిక అధికారులు ఆరోపించిన కొన్ని నెలల తర్వాత ఈ నివేదిక వచ్చింది.
ఫ్రెంచ్ నిఘా వర్గాలను ఉటంకిస్తూ.. ఈ తప్పుడు ప్రచారం కోసం చైనా ఏఐ చిత్రాలను, నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించిందని నివేదిక పేర్కొంది. రాఫెల్ జెట్ కొనుగోలు ఇండోనేషియా నిలిపేసేలా చైనా ఒప్పించిందని, ఈ ప్రాంతంలో ఉన్న దేశాలకు చైనా తన సైనిక పరికరాల ఎగుమతుల్ని పెంచిందని నివేదిక చెప్పింది. చైనా జూన్ 2025లో పాకిస్తాన్కు 40 J-35 ఐదవ తరం ఫైటర్ జెట్లు, KJ-500 విమానాలు మరియు బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను విక్రయించడానికి ఆఫర్ చేసినట్లు కూడా నివేదిక పేర్కొంది. అదే నెలలో పాక్ రక్షణ బడ్జెట్ 2025-26 కోసం 20 శాతం పెరిగిందని తెలిపింది.
తాజావార్తలు
-
West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు.. ‘ఇరాన్ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం’.. ట్రంప్
-
South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమాకు టైం వచ్చేసింది!
-
One Vote Victory: ఒక్క ఓటుతో గెలుపు.. తిరుపత్తూరులో టీవీకే అభ్యర్థి సంచలన విజయం!
-
KiaraAdvani : ‘టాక్సిక్’లో రొమాంటిక్ సీన్స్ పై కియారా కామెంట్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!