Operation Sindoor: ‘‘రాఫెల్ జెట్స్’’ కూలాయని చైనా తప్పుడు ప్రచారం: యూఎస్ రిపోర్ట్..
- రాఫెల్ కూలినట్లు చైనా తప్పుడు ప్రచారం..
- యూఎస్ నివేదికలో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది టూరిస్టుల్ని అన్యాయంగా చంపేశారు. దీనికి ప్రతిగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ప్రధాన కార్యాలయాలపై భీకరదాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదే సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత సైనిక స్థావరాలపై, ప్రజలపై దాడులకు యత్నించడంతో భారత్ పాకిస్తాన్ వైమానికి దళానికి చెందిన ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది.
Read Also: Mini Projector Tips: మినీ ప్రొజెక్టర్ కొంటున్నారా?.. ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
అయితే, నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సంఘర్షణలో భారత్కు చెందిన రాఫెల్ ఫైటర్ జెట్లు కూలిపోయాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదంతా చైనా చేసిన తప్పుడు ప్రచారమని యూఎస్ నివేదిక ఒకటి వెల్లడించింది. చైనా తన సొంత తయారీ ఫైటర్ జెట్ J-35లకు అనుకూలంగా ఫ్రెంచ్ రాఫెట్ జెట్ అమ్మకాలను అడ్డుకోవడానికి తప్పుడు సమచారాన్ని ప్రారంభించిందని అమెరికా రిపోర్ట్ వెల్లడించింది. రాఫెట్ ఫైటర్ జెట్ గొప్పతనాన్ని దెబ్బతీసేందుకు చైనా రహస్య ప్రచారాన్ని నిర్వహించిందని ఫ్రెంచ్ నిఘా, సైనిక అధికారులు ఆరోపించిన కొన్ని నెలల తర్వాత ఈ నివేదిక వచ్చింది.
ఫ్రెంచ్ నిఘా వర్గాలను ఉటంకిస్తూ.. ఈ తప్పుడు ప్రచారం కోసం చైనా ఏఐ చిత్రాలను, నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించిందని నివేదిక పేర్కొంది. రాఫెల్ జెట్ కొనుగోలు ఇండోనేషియా నిలిపేసేలా చైనా ఒప్పించిందని, ఈ ప్రాంతంలో ఉన్న దేశాలకు చైనా తన సైనిక పరికరాల ఎగుమతుల్ని పెంచిందని నివేదిక చెప్పింది. చైనా జూన్ 2025లో పాకిస్తాన్కు 40 J-35 ఐదవ తరం ఫైటర్ జెట్లు, KJ-500 విమానాలు మరియు బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను విక్రయించడానికి ఆఫర్ చేసినట్లు కూడా నివేదిక పేర్కొంది. అదే నెలలో పాక్ రక్షణ బడ్జెట్ 2025-26 కోసం 20 శాతం పెరిగిందని తెలిపింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!