Maldives Row: భారత్-మాల్దీవ్స్ వివాదం.. చైనా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives Row: భారత్, ద్వీప దేశం మాల్దీవ్స్ మధ్య తీవ్ర దౌత్య ఘర్షణ చెలరేగుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ సందర్శించి, అక్కడి పర్యటకాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవ్స్ ప్రభుత్వానికి నచ్చడం లేదు. దీంతో అక్కడి మంత్రులు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇక భారతీయుల దెబ్బకు ‘బాయ్కాట్ మాల్దీవ్స్’ హాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరోవైపు మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఇదిలా ఉంటే ‘ఇండియా అవుట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. మయిజ్జూ చైనా అనుకూలుడిగా ఉంటూ భారత వ్యతిరేక ధోరణి అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పర్యటన చర్చనీయాంశంగా మారింది. మయిజ్జూ చైనాలో దిగిన రోజే అక్కడి ప్రభుత్వ మీడియా సంపాదకీయలంలో ఆ దేశం కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
Read Also: Manushi Chhillar: రెడ్ శారీ లో నడుము అందాలు ఆరబోస్తున్న మానుషి చిల్లర్…
దక్షిణాసియా సమస్యలను చూడటానికి ‘‘ఓపెన్ మైండెడ్’’ విధానం అవసరమని చైనా చెప్పుకొచ్చింది. గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో చైనా ఎల్లప్పుడూ మాల్దీవ్స్ని సమాన భాగస్వామిగి చూస్తుందని, దాని సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తోందని పేర్కొంది. ‘‘ మాల్దీవులు, భారత్ మధ్య స్నేహపూర్వక, సహకార సంబంధాలను కూడా గౌరవిస్తాం. న్యూఢిల్లీలో మాలే సంబంధాల ప్రాముఖ్యత గురించి తెలుసు. చైనా, భారత్ మధ్య విభేదాలు ఉన్న కారణంగా బీజింగ్ ఎన్నడూ కూడా భారతదేశాన్ని దూరం పెట్టాలని కోరలేదు. ఇది మాల్దీవులు, భారత్ మధ్య సహకారానికి, సంబంధాలకు ముప్పుగా చూస్తాం’’ అని చైనా పేర్కొంది. చైనా-భారత్-మాల్దీవ్స్ మధ్య త్రైపాక్షిక సహకారాన్ని నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు డ్రాగన్ కంట్రీ పేర్కొంది. దక్షిణాసియా దేశాలతో చైనా సహకారం ‘జీరో-సమ్ గేమ్’, కాబట్టి న్యూఢిల్లీ మరింత ఓపెన్ మైండెడ్గా ఉండాలని పేర్కొంది.
అంతకుముందు చైనా విదేశాంగా శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. మయిజ్జూ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చలు జరుపుతారని, పలు ఒప్పందాలపై సంతకం చేయనున్నారని, చైనా-మాల్దీవుల మధ్య సంబంధాలు ఇప్పుడు చారిత్రాత్మకంగా మారుతాయని, ఇరు దేశాల మధ్య సంబంధాలు కొత్త ఎత్తులకు చేరుతాయని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!