China: భారత స్నేహం కోసం చైనా ఆరాటం.. వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ చైనా, భారత స్నేహాన్ని కోరుకుంటోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. భారత్, చైనాలు ఒకరినొకరు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చూసుకోవాలని అన్నారు. చైనా, భారత్లు రెండు ‘‘గ్లోబల్ సౌత్’’లో భాగమని, లోతైన సాంస్కృతిక సంబంధాలు, విస్తృత ఉమ్మడి ప్రయోజనాలను పంచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజింగ్లో జరిగిన 14వ జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ సెషన్ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
చైనా, భారత్ మధ్య పరస్పర విశ్వాసం, సహకారం భాగస్వామ్య అభివృద్ధికి అత్యంత సానుకూలంగా ఉన్నాయని, అయిత విభజన, ఘర్షణ ఆసియా ఆసియా పునరుజ్జీవనానికి విరుద్ధం అని అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయని చెప్పారు. దీంతో రెండు దేశాల మధ్య సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు.
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
Read Also:Nishant Kumar: జేడీయూలో చేరిన సీఎం నితీష్ కుమార్ తనయుడు..
గత ఏడాది ఆగస్టులో టియాంజిన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు జి జిన్పింగ్ సమావేశమయ్యారని వాంగ్ యి గుర్తు చేసుకున్నారు. కజాన్ తర్వాత జరిగిన ఈ సమావేశం భారత్-చైనా సంబంధాలను మరింత బలోపేతం చేసిందని, రెండు దేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం క్షేత్రస్థాయిలో అమలు చేయబడుతోందని, వాణిజ్యం గరిష్ట స్థాయికి చేరుకుందని అన్నారు.
బ్రిక్స్ వేదికలో భారత్, చైనాలు కలిసి పనిచేయాలని వాంగ్ యీ చెప్పారు. ఈ ఏడాది బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తోంది. వచ్చే ఏడాది చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, కొన్ని ఏళ్లుగా చైనా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. యూఎస్ ఆంక్షలు కూడా చైనాలో ఆందోళన పెంచుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ యుద్ధం కూడా చైనా ఎకానమీని ప్రభావితం చేస్తుంది. దీంతో భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చైనా ఆరాట పడుతోంది.
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!