CHINA: రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు చైనాపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలను కోరారు. నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేయాలని ఆయన ఓ లేఖలో కోరారు. చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని లేఖలో కోరారు. అన్ని నాటో దేశాలు అంగీకరించి సుంకాలు వేయడానికి సద్ధంగా ఉన్నప్పుడు, తాను రష్యాపై పెద్ద ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.
Read Also: Zohran Mamdani: న్యూయార్క్లో నెతన్యాహూను అరెస్ట్ చేయిస్తా.. మమ్దానీ వార్నింగ్..
అయితే, ట్రంప్ ప్రతిపాదనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘తాము యుద్ధానికి కుట్రలు పన్నడం లేదని, యుద్ధాల్లో పాల్గొనడం లేదని’’ చైనా కఠినమైన, స్పష్టమైన సందేశం ఇచ్చింది. స్లోవేనియా పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. యుద్ధం సమస్యలను పరిష్కరించలేదని, ఆంక్షలు వాటిని క్లిష్టతరం చేస్తాయని రాయిటర్స్లో అన్నారు.
ఇదే విధంగా, రష్యా నుంచి చమురు కొంటున్న భారత్పై కూడా సుంకాలు విధించాలని ట్రంప్ నాటో దేశాలకు పిలుపునిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల రష్యాపై ఒత్తిడి పెరుగుతోందని, తద్వారా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందని ట్రంప్ చెబుతున్నాడు. ఇప్పటికే, రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధానికి భారత్ పరోక్షంగా, రష్యా నుంచి చమురు కొంటూ సాయం చేస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. దీంతో భారత్పై ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 50 శాతం సుంకాలను విధించారు. ఈయూ, యూరోపియన్, నాటో దేశాలను కూడా భారత్, చైనాలపై సుంకాలు పెంచాలని కోరుతున్నారు.