China Blocks India: మరోసారి పాకిస్తాన్కు మద్దతుగా చైనా.. ఇండియా ప్రతిపాదనకు అడ్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Blocks India-US Move At UN Again On Blacklisting Pak-Based Terrorist: డ్రాగన్ దేశం చైనా మరోసారి తన భారత వ్యతిరేకతను ప్రదర్శించిది. తన మిత్రదేశం పాకిస్తాన్ దేశానికి వంతపాడింది చైనా. ప్రపంచంలో ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్తాన్ ఉందని అన్ని దేశాలకు తెలుసు. భారతదేశంపైకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పడు ఎగదోస్తుంటుంది పాకిస్తాన్. అయినా కూడా తాము ఉగ్రవాద బాధితులమే అని మొసలి కన్నీరు కారుస్తుంటుంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, ఆల్ ఖైదా, హక్కానీ నెట్ వర్క్ వంటి ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా ఉంది. ఆయా ఉగ్రవాద సంస్థల అగ్రనేతలు పాకిస్తాన్ లో బహిరంగంగానే తిరుగుతుంటారు. అయినా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదు.
Read Also: Snake on Plane: విమానంలో పాము.. ఆందోళనకు గురైన ప్రయాణికులు..
Also Read
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
ఇదిలా ఉంటే పాకిస్తాన్ దేశానికి చెందిన లష్కరే తోయిబా నాయకుడు షాహిద్ మహమూద్ ను నిషేధిత జాబితాలో చేర్చాలని, అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను నిలిపివేసింది చైనా. పాక్ ఉగ్రవాది షాహిద్ మహసూద్ నిషేధిత జాబితాలో చేర్చాలని గత కొన్ని నెలలుగా భారత్, అమెరికా నాలుగు సార్లు ప్రతిపాదనలు చేస్తే చైనా తన వీటో అధికారంలో అడ్డుకుంటోంది. ఇప్పటికి ఇలా అడ్డుకోవడం నాలుగోసారి.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని 1267 ఆల్ ఖైదా ఆంక్షల కింద మహసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియకు పాకిస్తాన్ కు అండగా నిలుస్తోంది చైనా. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ డిసెంబర్ 2016లో మహమూద్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. భద్రతా మండలిలో శాశ్వస సభ్యదేశాలు అయిన ఫ్రాన్స్, చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాల్లో చైనా మినహా మిగతా దేశాలు అన్నీ కూడా భారత నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాయి. ప్రతీసారి భారత్ ను ఇరుకున పెట్టేందుకు చైనా, పాకిస్తాన్ దేశానికి వంత పాడుతోంది.
తాజావార్తలు
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!