Rajnath Singh: రక్షణ మంత్రితో సీడీఎస్ అనిల్ చౌహాన్ భేటీ.. నార్త్ బ్లాక్కు బీఎస్ఎఫ్ చీఫ్..
- రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లో సీడీఎస్ అనిల్ చౌహాన్ భేటీ..
- భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే దౌత్యపరమైన దాడిని ప్రారంభించింది. ఇక మిలిటరీ యాక్షన్ ఏదైనా ఉంటుందా..? అనే దానిపై దేశ ప్రజలు మాట్లాడుతుకుంటున్నారు. తాజాగా, ఆదివారం, త్రివిధ దళాల చీఫ్, చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ని ఆయన నివాసంలో కలిశారు. వీరిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Vajra Super Shot: ఐపీఎల్లో మరింత భద్రత పెంపు.. రంగంలోకి “వజ్ర సూపర్ షాట్”
Also Read
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
- Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
ఇద్దరి మధ్య సమావేశం 40 నిమిషాల పాటు కొనసాగింది. మరోవైపు, బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి రాజ్నాథ్ సింగ్కు సీడీఎస్ వివరణాత్మక సమాచారం ఇచ్చారు. ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో త్రివిధ దళాలు, నౌకాదళం, వైమానిక దళాల సంసిద్ధతపై చర్చించినట్లు తెలుస్తోంది. సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో ఉన్న హోం మంత్రిత్వ శాఖకు కార్యాలయానికి వెళ్లారు. సరిహద్దుల భద్రతపై అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఈ భేటీ తర్వాత, ఏదైనా మిలిటరీ యాక్షన్ ఉంటుందా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ భయపడుతోంది. మరోవైపు, భారత్ నేవీ అరేబియా సముద్రంలో యుద్ధ విన్యాసాలు, క్షిపణి పరీక్షలు చేపట్టడం పాక్ వెన్నులో వణుకు పట్టిస్తోంది. బయటకు పాక్ మంత్రులు అణ్వాయుధాలు ఉన్నాయని ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ లోలోపల మాత్రం భయం అలాగే ఉంది.
#WATCH | Delhi | Chief of General Staff (CDS) General Anil Chauhan arrives at the residence of Raksha Mantri Rajnath Singh. pic.twitter.com/7nv9SpZzIC
— ANI (@ANI) April 27, 2025
తాజావార్తలు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!