Vajra Super Shot: ఐపీఎల్లో మరింత భద్రత పెంపు.. రంగంలోకి “వజ్ర సూపర్ షాట్”
- ఐపీఎల్ స్టేడియమ్స్ వద్ద మరింత భద్రత పెంపు..
- రంగంలోకి “వజ్ర సూపర్ షాట్”
- అనధికార డ్రోన్ల కదలికలను ట్రాకింగ్ దిశగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vajra Super Shot: ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఐపీఎల్ 2025 సీజన్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా మారినట్లు తెలుస్తోంది. దీనికి కారణం గగనతలంలో భద్రత కోసం ‘వజ్ర సూపర్ షాట్’ అనే యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఐపీఎల్ స్టేడియంల వద్ద ప్రవేశపెట్టడమే. ఐపీఎల్ 2025లో భద్రత పెంచడం కోసం బీసీసీఐ, భద్రతా బృందాలు అన్ని స్టేడియంలలో కట్టుదిట్టమైన తనిఖీలు, అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి. దీనితో క్రికెట్ అభిమానులు ఎలాంటి భయం అవసరం లేకుండా మ్యాచ్లను ఆస్వాదించేలా తగు చర్యలు తీసుకుంటున్నారు సంబంధిత అధికారులు. ఈ సరికొత్త సాంకేతికత ఇకపై అభిమానులకు, ఆటగాళ్లకు సురక్షితమైన వాతావరణాన్ని అందించనుంది.
ఇకపోతే, అసలు వజ్ర సూపర్ షాట్ అంటే ఏమిటి? దీనిని ఎందుకు ఉపయోగిస్తున్నారన్న విషయానికి వస్తే.. ఈ వజ్ర సూపర్ షాట్, చెన్నైకి చెందిన బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (BBBS) అభివృద్ధి చేసిన ఓ అత్యాధునిక యాంటీ-డ్రోన్ వ్యవస్థ. దీని ద్వారా చుట్టూ నాలుగు కి.మీ.ల పరిధిలో అనధికార డ్రోన్ల కదలికలను గుర్తించి వాటి సమాచార వ్యవస్థను అడ్డుకునేలా దీనిని రూపొందించారు. ఇక ఈ వజ్ర సూపర్ షాట్ చాలా తేలికైన టెక్నాలజీ. కాబట్టి దీనిని సులభంగా తీసుక వెళ్లవచ్చు కాబట్టి, ఐపీఎల్ వంటి పెద్ద ఈవెంట్లకు ఇది బాగా సరిపోతుంది. ఇక ఈ కొత్త టెక్నాలజీ వ్యవస్థను మొదటిసారిగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఉపయోగించారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇక 5 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ వద్ద లష్కర్-ఎ-తొయిబాకు చెందిన ఉగ్రవాదులు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 26 మంది యాత్రికులను హత్య చేయడంతో.. ఈ దాడి నేపథ్యంలో భారత్ లో భద్రతా వ్యవస్థలపై ఆందోళనలను పెంచింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ఆటగాళ్లు హాజరవుతున్న నేపథ్యంలో స్టేడియంల వద్ద భద్రత కోసం అధికారులు ఈ సరికొత్త ‘వజ్ర సూపర్ షాట్’ను రంగంలోకి తీసుక వచ్చారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!