Chidambaram: అమెరికా ఆపింది లేదంటే పాక్తో యుద్ధం చేసే వాళ్లమే..
- ముంబై దాడుల తర్వాత పాక్పై యుద్ధం చేసే వాళ్లమే..
- కానీ అమెరికా మమ్మల్ని వద్దని కోరింది..
- కాంగ్రెస్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chidambaram: 2008 ముంబై ఉగ్రవాద దాడుల గురించి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. 175 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘోర ఉగ్రవాద ఘటన తర్వాత, అప్పటి యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేయాలని భావించిందని, అయితే అమెరికా ఒత్తిడి మేరకు తాము ఆ పనిచేయలేదని చిదంబరం అన్నారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత, చిదంబరం కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్తో యుద్ధం వద్దని చెప్పడానికి ప్రపంచం మొత్తం ఢిల్లీకి వచ్చిందని చెప్పారు.
“అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఉన్న కొండోలీజా రైస్, నేను బాధ్యతలు స్వీకరించిన రెండు లేదా మూడు రోజుల్లో నన్ను, ప్రధానమంత్రిని కలవడానికి వచ్చారు. ‘దయచేసి స్పందించవద్దు’ అని చెప్పారు. ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అని నేను చెప్పాను. ఏ అధికారిక రహస్యాన్ని వెల్లడించకుండా, మనం ఏదైనా ప్రతీకారం తీర్చుకోవాలని నా మనసులో అనిపించింది” అని చిదంబరం ఓ వార్త ఛానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూ చెప్పారు. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రధానితో, ఇతర ముఖ్యమైన వ్యక్తులతో తాను చర్చించానని వెల్లడించారు.
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Read Also: H-1B visa: H-1B వీసాలపై మరిన్ని కఠిన నిర్ణయాలు.. ఫిబ్రవరి నాటికి కొత్త వ్యవస్థ..
చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. చిదంబర్ వ్యాఖ్యలు చాలా ఆలస్యం, చాలా తక్కువ అని బీజేపీ విమర్శించింది. ముంబై దాడుల తర్వాత విదేశాల ఒత్తిడి వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. బీజేపీ ప్రతినిధి షహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ముంబై దాడుల తర్వాత హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి చిదంబరం మొదట్లో ఇష్టపడలేదని, పాకిస్తాన్ పై సైనిక చర్య తీసుకోవాలని కోరుకున్నా, వేరే వాళ్లు గెలిచారని ఆరోపించారు.
ముంబై దాడులు, సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుడు తర్వాత పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఇచ్చారని, అదనే సమయంలో హిందూ ఉగ్రవాదం అనే తప్పుడు కథనాన్ని తెర పైకి తెచ్చారని బీజేపీ చిదంబరం, కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే ఉగ్రవాద దాడులు చేసిన అప్పటి యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్కు అత్యంత అనుకూల దేశం(ఎంఎఫ్ఎన్) హోదా కల్పించడాన్ని ఆయన తప్పుపట్టారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?